ఆ ప్రకటనలకు ఇక దూరం.. అమితాబ్ నిర్ణయంపై ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ సంచలన ప్రకటన చేశారు. ఆయన ఒక పాన్ మసాలా ప్రొడక్ట్ తో కుదుర్చుకున్న బ్రాండ్ అంబాసిడర్ కాంట్రాక్టును రద్దు చేసుకున్నారు. అలాగే ప్రమోషనల్ డబ్బులను కూడా వాపసు ఇచ్చేశారు. ఈ పాన్ మసాలా ప్రకటనను చట్టం నిషేధించిన సరోగేట్ యాడ్స్ గా పరిగణిస్తారని బిగ్ బీకి తెలియక ఒప్పుకున్నట్లు ఆయన టీమ్ చెబుతోంది. గుట్కాకి బదులుగా పాన్ మసాలా అని ప్రకటనలో రూపంలో అందరికీ తెలియచేయడం జరుగుతుంది. అయితే ఇలాంటి పాన్ మసాలాను అమితాబ్ బచ్చన్ ప్రమోట్ చేస్తుండడంతో ఓ యాంటీ-టొబాకో సంస్థ ప్రచారం ఆపాలని అతనికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అమితాబ్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ప్రజారోగ్యం కోసం బిగ్ బి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాయి సలాం బాంబే, ఇండియన్ క్యాన్సర్ సొసైటీ, ఇండియన్ డెంటల్ అసోసియేషన్, హీలీస్ షేక్ శారియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వంటి సంస్థలు.
పొగరాకుండా నమిలే ఖైనీ, గుట్కా ఉత్పత్తుల వల్ల క్యాన్సర్ వస్తోంది. ఇలాంటి పాన్ మసాలాను ప్రమోట్ చేయకూడదని బిగ్ బీ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. భారతదేశంలో సంభవిస్తున్న మరణాలకు, వ్యాధులకు పొగాకు వాడకం ఒక ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలో తెలిపింది. పొగాకు వినియోగం ప్రతి సంవత్సరం దాదాపు 1.35 మిలియన్ల మరణాలకు కారణమవుతుందని సంస్థ తెలిపింది. వీటినుంచి యువతను రక్షించేందుకు యాంటీ టొబాకో ఆర్గనైజేషన్ నడుం బిగించింది. ఈ నేపథ్యంలో గత నెలలో భారత సినీ దిగ్గజం అమితాబ్ బచ్చన్ కు నేషనల్ యాంటీ టొబాకో ఆర్గనైజేషన్ సంచలన లేఖ రాసింది. పాన్ మాసాలాను ప్రచారం చేసే వాణిజ్య ప్రకటన నుంచి వైదొలగాలని లేఖలో కోరింది.
Also Read
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Netanyahu-Iran: ఇరాన్కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి దాడి చేస్తే మాత్రం..!
ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రకటనల నుంచి అంగీకరించవద్దని కోరింది. ఈ మేరకు నేషనల్ యాంటీ టొబాకో ఆర్గనైజేషన్ అధ్యక్షుడు శేఖర్ సల్కర్ బిగ్బీకి లేఖ రాశారు. అమితాబ్ హై ప్రొఫైల్ పల్స్ పోలియో ప్రచారానికి ప్రభుత్వం తరపున బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్నారని… అలాంటి వ్యక్తి ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేసే పాన్ మసాలా యాడ్ లో నటించడం సరికాదని లేఖలో శేఖర్ సల్కర్ అన్నారు. వీలైనంత త్వరగా అమితాబ్ ఈ యాడ్ నుంచి తప్పుకోవాలని… అప్పుడు పొగాకు వ్యసనానికి యువత దూరమయ్యేందుకు దోహదపడినట్టవుతుందని చెప్పారు. ఈ లేఖపై స్పందించిన అమితాబ్ పాన్ మసాలా ప్రకటనలనుంచి వైదొలిగారు.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!