భూవివాదంలో చిక్కుకున్న వైసీపీ మహిళా మంత్రి
ఏపీ మహిళా మంత్రి తానేటి వనిత భూ వివాదంలో చిక్కుకున్నారు. తాడేపల్లిగూడెంలో మంత్రి తానేటి వనితకు, శివానంద మఠానికి చెందిన వ్యక్తులకు మధ్య భూ వివాదం నడుస్తోంది. గతంలో కొంతమంది దాతలు 25 సెంట్ల భూమిని శివానంద మఠానికి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ భూమిలో వ్యాపార సముదాయం నిర్మించేందుకు మంత్రి తానేటి వనిత శంకు స్థాపన చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. కాగా ఈ శంకుస్థాపనను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also: రాజకీయాలు.. రాజకీయంగానే ఉండాలి: నందమూరి సుహాసిని
Also Read
కాగా ఈ స్థలం తమ వంశస్తులకు చెందిందని, ఈ స్థలంపై తనకు పూర్తి హక్కు ఉందని బండి రామ స్వామి అనే వ్యక్తి పత్రాలు చూపిస్తున్నారు. అతడిని కూడా తాడేపల్లిగూడెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ….2014లో ఈ స్థలాన్ని మేడపాటి మురళీ మోహన్ రెడ్డి దగ్గర కొనుగోలు చేశానని.. 30 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్స్ తమ వద్ద ఉన్నాయని వివరణ ఇచ్చారు. ఇప్పుడు వచ్చి ఆందోళన చేస్తున్న వారి దగ్గర డాక్యుమెంట్లు లేవని.. . రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టేందుకే ఈ గొడవ అంటూ మంత్రి తానేటి వనిత వ్యాఖ్యానించారు.

తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!