ఏపీ మహిళా మంత్రి తానేటి వనిత భూ వివాదంలో చిక్కుకున్నారు. తాడేపల్లిగూడెంలో మంత్రి తానేటి వనితకు, శివానంద మఠానికి చెందిన వ్యక్తులకు మధ్య భూ వివాదం నడుస్తోంది. గతంలో కొంతమంది దాతలు 25 సెంట్ల భూమిని శివానంద మఠానికి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ భూమిలో వ్యాపార సముదాయం నిర్మించేందుకు మంత్రి తానేటి వనిత శంకు స్థాపన చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. కాగా ఈ శంకుస్థాపనను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also: రాజకీయాలు.. రాజకీయంగానే ఉండాలి: నందమూరి సుహాసిని
కాగా ఈ స్థలం తమ వంశస్తులకు చెందిందని, ఈ స్థలంపై తనకు పూర్తి హక్కు ఉందని బండి రామ స్వామి అనే వ్యక్తి పత్రాలు చూపిస్తున్నారు. అతడిని కూడా తాడేపల్లిగూడెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ….2014లో ఈ స్థలాన్ని మేడపాటి మురళీ మోహన్ రెడ్డి దగ్గర కొనుగోలు చేశానని.. 30 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్స్ తమ వద్ద ఉన్నాయని వివరణ ఇచ్చారు. ఇప్పుడు వచ్చి ఆందోళన చేస్తున్న వారి దగ్గర డాక్యుమెంట్లు లేవని.. . రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టేందుకే ఈ గొడవ అంటూ మంత్రి తానేటి వనిత వ్యాఖ్యానించారు.