వినాయక చవితి వచ్చింది అంటే వివిధ రూపాల్లో మండపాల్లో గణనాథులు కొలువుదీరుతారు. ఒక మండపంలో ఉండే గణేషుని విగ్రహ రూపం ఒకలా ఉంటే మరోక చోట మరో రూపంతో విగ్రహం కనిపిస్తుంది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కరోనా మహమ్మారిని తన పాదాల కింద అణగదొక్కుతున్న రూపంలో గణపతి దర్శనం ఇస్తున్నాడు. అయితే, పంజాబ్లోని లూథియానాలోని గణపతి ఇప్పుడు అందర్ని అకట్టుకుంటున్నాడు. ఆ గణపతిని తయారు చేయడానికి 200 కిలోల డార్క్ చాక్లెట్ను వినియోగించారు. ఈ డార్క్ చాక్లెట్ గణేషుడిని చూసేందుకు లూథియానాలో ప్రజలు క్యూలు కడుతున్నారు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Read: ప్రపంచ దేశాలపై ఐరాస ఆగ్రహం… ఆ విషయంలో దేశాలు తప్పుచేస్తున్నాయి…