NTV Telugu Site icon

బకాయిలు చెల్లించాలని లీగల్‌ నోటీసులు: తమన్నా భాటియా

జెమిని టీవిలో ప్రసారం అయ్యే “మాస్ట్‌ర్‌ చెఫ్‌” కార్యక్రమానికి తమన్నా భాటియా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మొదట్లో ఈ కార్యక్రమానికి బాగానే ఆదరణ వచ్చిన ఆ తర్వాత ఎందుకో అంతగా ఆదరణకు నోచుకోలేదు. దీంతో తమన్నా స్థానంలో బుల్లితెర యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ను తీసుకున్నారు. దీంతో తమన్నా ప్రొడక్షన్‌ హౌస్‌కు షాక్‌ ఇచ్చింది. తనను తొలగించడంపై అసంతృప్తితో ఉన్న ఈ ముద్దుగుమ్మ తనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని ప్రొడక్షన్‌ హౌస్‌కు లీగల్‌ నోటీసులు పంపించిందని సమాచారం.