లక్షద్వీప్ వాసుల కోసం గొంతెత్తిన పృథ్వీరాజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ లక్షద్వీప్ వాసుల కోసం గొంతెత్తాడు. తన సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా అక్కడి ప్రజల మనోభావాలను ప్రపంచానికి తెలియచేసే ప్రయత్నం చేశాడు. అరేబియా సముద్రంలోని లక్షద్వీప్ యూనియన్ టెర్రీటరీ. అక్కడ ఎంపీగా ఎన్సీపీకి చెందిన మహ్మద్ ఫైజల్ ఎన్నికయ్యారు. అడ్మినిస్ట్రేటర్ గా బీజేపీకి చెందిన ప్రఫుల్ పటేల్ నియమితులయ్యారు. అయితే ఇటీవల లక్ష్యద్వీప్ లో అధికారులు తీసుకొచ్చిన కొత్త సంస్కరణలపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. నేరాలు జరగని ప్రాంతంలో అధికారులు గూండా చట్టాన్ని ప్రవేశ పెట్టి ప్రజలను భయభ్రాతులకు గురి చేస్తున్నారన్నది వారి ప్రధాన ఆరోపణ. ఈ విషయాన్ని నటుడు పృథ్వీరాజ్ దృష్టికి కూడా తీసుకెళ్ళడంతో ఈ స్టార్ హీరో స్పందించాడు. తాను హైస్కూల్ లో చదువుతుండగా తొలిసారి విహార యాత్రకు లక్షద్వీప్ వెళ్ళానని పృథ్వీరాజ్ చెప్పుకున్నాడు. ఆ తర్వాత కూడా సచి ‘అనార్కలీ’ షూటింగ్ కోసం లక్షద్వీప్ కవరత్తిలోనే రెండు నెలల పాటు గడిపానని, అది తనకు లైఫ్ టైమ్ ఎక్స్ పీరియర్స్ ను ఇచ్చిందని తెలిపాడు. తాను దర్శకత్వం వహించిన ‘లూసిఫర్’ మూవీ యాక్షన్ ఎపిసోడ్స్ ను సైతం ప్రజల సహకారంతో లక్షద్వీప్ లోనే చిత్రీకరించానని పృథ్వీరాజ్ చెప్పాడు. తనకు తెలిసిన వారు, తెలియని వారు సైతం లక్షద్వీప్ లో జరుగుతున్న తంతుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నాడు. ఏ సంస్కరణలైనా భూభాగం ఆధారంగా కాకుండా అక్కడ నివసించే వ్యక్తులకు సంబంధించి జరగాలని, వారి మనోభావాలను అధికారులు గ్రహించాలని కోరాడు. తన ద్వారా అక్కడి సమస్య ప్రపంచానికి తెలియాలని స్థానికులు కోరడంతో ఈ పనిచేస్తున్నానని చెప్పాడు. అదే సమయంలో తనకు ఈ వ్యవస్థపై నమ్మకం ఉందని, అంతకు మించిన నమ్మకం ప్రజలపై ఉందని తెలిపాడు. కాబట్టి సంబంధిత అధికారులు లక్షద్వీప్ ప్రజల మాటలను ఆలకించాలని, వారికి ఏది మేలు చేస్తుందో వారి నుండి తెలుసుకోవాలని కోరాడు. మరి పృథ్వీరాజ్ తో మరికెంతమంది ఫిల్మ్ సెలబ్రిటీలు గొంతు కలుపుతారో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!