NTV Telugu Site icon

Avinash Reddy: వివేకా హత్య కేసు.. నేడు సీబీఐ ముందుకు అవినాష్‌ రెడ్డి

Mp Avinash Reddy

Mp Avinash Reddy

YSRCP Avinash Reddy: వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి నేడు సీబీఐ ఎదుట హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రానున్నారు. అవినాష్ రెడ్డికి అడిగే ప్రశ్నలు ఏంటి ఎంతటైం ప్రశ్నిస్తారు.. మళ్లీ వస్తారా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఈ ఎపిసోడ్‌ని వైసీపీ నేతలే కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. వివేకానంద హత్య కేసులో సీబీఐ అధికారులు ఇప్పటివరకు చాలా మందిని ప్రశ్నించారు. వారంతా చాలా సాధారణ వ్యక్తులు కాగా.. ప్రజలకు పెద్దగా తెలియదు. ఇప్పుడు తొలిసారిగా ఓ ప్రజాప్రతినిధిపై సీబీఐ విచారణ చేపట్టింది. అందుకే ఈ విచారణ తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. అందులో అవినాష్‌రెడ్డి సీఎం జగన్‌ సోదరుడు. వివేకా కూతురు సునీత కూడా అతనిపై అనుమానం వ్యక్తం చేసింది. హత్యకేసులో అతడితోపాటు తమ తండ్రి పాత్ర కూడా ఉందని మొదటి నుంచి నమ్ముతున్నారు. ఇన్నాళ్లు చాలా మందకొడిగా సాగుతున్న సీబీఐ విచారణ తెలంగాణ నుంచి ప్రారంభమైనప్పటి నుంచి వేగం పుంజుకుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఎప్పటి నుంచో అవినాష్ రెడ్డిగా పిలుస్తారు, ఆయన్ను విచారిస్తారనే ప్రచారం జరుగుతున్నా.. ఇన్నాళ్లకు ఆయన్ను పిలిచి విచారిస్తున్నారు.

Read also: Waltair Veerayya: వరంగల్‌ కు వాల్తేరు వీరయ్య టీమ్.. గెస్ట్ గా ఆర్ఆర్ఆర్ హీరో..

ఈ కేసులో నిజానిజాలు ఇంకా బయటపెట్టాలని కుటుంబ సభ్యులు, పలువురు కోరుతున్నారు. సీబీఐ అధికారులపై అధికార పార్టీ వైసీపీ ఒత్తిడి తెచ్చిందని అందుకే విచారణ ఆలస్యమవుతోందని కుటుంబ సభ్యులు కూడా ఆరోపించారు. అందుకే విచారణను ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని సునీత కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ నుంచే విచారణ కొనసాగించాలని కోర్టు తీర్పునిచ్చింది. తెలంగాణలో తొలిదశ విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. తొలుత నోటీసులు ఇచ్చిన సీబీఐ అధికారులు మరుసటి రోజు విచారణకు రావాలని కోరారు. అంటే జనవరి 24న నోటీసులు జారీ చేసిన అధికారులు జనవరి 25న విచారణకు పిలిచారని.. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూళ్ల ప్రకారం తాను చేయాల్సింది చాలా ఉందన్నారు. ఐదు రోజులు పాటు విచారణకు రాలేనని సీబీఐ అధికారులకు సమాధానమిచ్చారు. అవినాష్ రెడ్డి వివరణను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. 28న అంటే ఈరోజు (శనివారం) విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈరోజు మూడు గంటల నుంచి హైదరాబాద్ లో సీబీఐ అధికారులు విచారణ చేపట్టనున్నారు. ఈ విచారణ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో… సీబీఐ ఎలాంటి ట్విస్ట్‌లు ఇవ్వబోతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
KTR Nizamabad Tour: నేడే నిజామాబాద్‌కు మంత్రి కేటీఆర్.. శంకుస్థాపనలు, బహిరంగ సభ