టీఆర్ ఎస్ ప్రభుత్వం రైతు హంతక ప్రభుత్వమని వైఎస్ షర్మిల అన్నారు. రైతు ఆవేదన యాత్రలో భాగంగా ఇవాళ మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కంచన్ పల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు గాండ్ల శ్రీకాంత్ కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు వైఎస్ షర్మిల.
ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ… అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఈ రైతు కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని…సర్కారు తరఫున ఏ ఒక్కరూ పరామర్శించలేదని మండిపడ్డారు. రైతుల పాలిట కేసీఆర్ ఓ ఊసరవెళ్లి అని… వరి వేయొద్దనే అధికారం కేసీఆర్ కు ఎక్కడిది? అని నిలదీశారు. రైతుల జీవితాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమని.. అన్నదాతల ఆత్మహత్యలకు కేసీఆరే కారణమని మండిపడ్డారు.
