ఖమ్మం మంత్రి అజయ్ పై వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ధ్వజమెత్తారు. ఇదే ఖమ్మం పట్టణం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ వేధింపులు తట్టుకోలేక .. ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నారని ఆమె మండిపడ్డారు. ఇక్కడ నియంత పాలన జరుగుతుందని, ఉత్తి పుణ్యానికి మంత్రి కూడా అయ్యాడని.. మంత్రి అయ్యాక… ఆ పదవికి విలువ లేదు.. హోదా తెలియదు.. హుందా కూడా తెలియదంటూ ఆమె విమర్శలు గుప్పించారు. పువ్వాడ కు ఎన్ని ఆస్తులు సంపాదించినా…ఎన్ని కబ్జాలు చేసినా…దనదాహం మాత్రం తీరదు అంటూ ఆమె అగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులు.. ప్రైవేట్ ఆస్తులు అన్ని కబ్జా చేస్తాడు.. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అనేది పువ్వాడ కు సరిపోతుందంటూ ఆమె ఎద్దేవా చేశారు.
ఒకప్పుడు ఇల్లు లేని పువ్వాడకు హైదరాబాద్ శామీర్ పేట లో 80 ఎకరాల భూమి ఎలా వచ్చిందని, ఖమ్మంలో ఏ కాంట్రాక్ట్ చేసినా ఇతనే చేయాలని, ఆయన భార్య కంపెనీ.. లేదా బినామీ కంపెనీలే చేయాలంటూ ఆమె ధ్వజమెత్తారు. రోడ్లు,కెనాల్,బస్టాండ్ లు,అన్ని ఈయనే చేయాలని, 100 రూపాయల దగ్గర నుంచి 100 కోట్ల వరకు ఏ కాంట్రాక్ట్ అయినా పువ్వాడ నే చేయాలంటూ ఆమె విరుచుకుపడ్డారు. పువ్వాడ ఖమ్మంకి చేసింది ఏమిటి అని ఆమె ప్రశ్నించారు. ఖమ్మంలో వాన పడితే రోడ్లు వరదలు అవుతున్నాయని, ఈయన ట్రాన్స్ పోర్ట్ మంత్రి ఆర్టీసీ పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుందంటూ ఆమె చురకలు అంటించారు.
ఆర్టీసీ కార్మికుల బ్రతుకులను రోడ్ల పాలు చేశారని ఆమె దుయ్యబట్టారు. కనీసం యూనియన్స్ లేకుండా చేశారని, పువ్వాడ ఒక నికృష్టుడు అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పువ్వాడ ఒక దిక్కుమాలిన మంత్రి… ఒక కంత్రి.. ఈ దిక్కుమాలిన మంత్రి వైఎస్సార్ విగ్రహాలను తీసేస్తున్నారు అంటూ ఆమె మండిపడ్డారు. పువ్వాడ ను హెచ్చరిస్తున్నం.. పోలీస్ లను పనొల్లులా…కుక్కల్లా వాడుకోవడం మొగతనం కాదు.. ఒక రౌడీ షీటర్ గా వ్యవహరించడం గొప్ప తనం కాదు.. దమ్ముంటే ప్రజలు ఇచ్చిన పదవి తో మేలు చెయ్యి.. మీకు దమ్ము లేదు..పని తనం లేదు.. పువ్వాడ అజయ్ కున్న పేరు…గుండా…రౌడీ షీటర్… దొంగ..ఒక బ్లాక్ మెయిలర్ అంటూ ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు.