తెలంగాణలో పార్టీ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు వైఎస్ షర్మిల… ఇప్పటికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో.. తన అనుచరుడితో కేంద్ర ఎన్నికల కమిషన్లో రిజిస్ట్రర్ చేయించారు.. అభ్యంతరాలు ఉంటే తెలపాలంటూ ఓ ప్రకటన కూడా చేశారు.. మరోవైపు పార్టీ నిర్మాణంపై కూడా దృష్టి సారించారు.. తాజాగా, వైఎస్ షర్మిల ఆదేశానుసారం.. అడ్ హక్ అధికార ప్రతినిధులను నియమించినట్టు ఆమె కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.. ఆ ప్రకటన ప్రకారం వైఎస్ఆర్టీపీ అధికార ప్రతినిధులుగా.. కొండా రాఘవరెడ్డి, తూడి దేవేందర్ రెడ్డి, ఇందిరా శోభన్, పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న, సయ్యద్ ముజ్టాబ్ అహ్మద్, ముజాదద్ది, భూమి రెడ్డి, బీశ్వ రవీందర్ను నియమించినట్టు ప్రకటనలో పేర్కొంది వైఎస్ షర్మిల కార్యాలయం.
వైఎస్ఆర్టీపీ అధికార ప్రతినిధుల నియామకం.. వీరికి చోటు..
YS Sharmila