Kamareddy: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా.. న్యాయం చేయాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamareddy: తనను ప్రేమించి మోసం చేశాడంటూ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బంధువులతో కలిసి బైఠాయించింది. తాళం వేసి ఉన్న ప్రియుడి ఇంటి ముందు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఆందోళనకు దిగిన ఘటన కామారెడ్డి బీబీపేట్ మండలంలో కలకలం సృష్టించింది.
వివరాల్లోకి వెళితే..
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రానికి చెందిన ప్రశాంత్… అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. నాలుగేళ్లుగా వీరి ప్రేమ కొనసాగడంతో ప్రశాంత్ కుటుంబ సభ్యులు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు ప్రియుడి ఇంటికి వెళ్లి విషయాన్ని ప్రియుడి కుటుంబ సభ్యులకు వివరించింది. అయినా ప్రియుడి కుటుంబసభ్యులు స్పందించకపోవడంతో.. చివరకు న్యాయం కోసం పోలీస్టేషన్ మెట్లు ఎక్కింది. తను శారీరకంగా దగ్గరయ్యామని, స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బీబీపేట పోలీసులు ప్రశాంత్పై అత్యాచారం కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. రెండు నెలల జైలు శిక్ష తర్వాత 10 రోజుల క్రితం బెయిల్పై విడుదలయ్యాడు. ప్రశాంత్ను పెళ్లి చేసుకోవాలని బాధితురాలు కోరగా, ‘నువ్వు కేసు పెట్టావు, నేను జైలు శిక్ష అనుభవించాను. కేసు ఇంకా కోర్టులో నడుస్తోంది.
ఈ పరిస్థితుల్లో తను పెళ్లి చేసుకోలేను అంటూ ప్రియుడు ప్రశాంత్ ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో పరార్ అయ్యాడు. దీంతో మోసపోయానని గ్రహించిన ప్రియురాలు కుటుంబ సభ్యులతో కలసి తాళం వేసి ఉన్న ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి ఆందోళనకు దిగింది. ఆమెను ప్రేమించి శారీరకంగా వాడుకుని మోసం చేసిన ప్రశాంత్.. సచ్చినా తనతోనే, బతికినా తనతోనే బతుకుతానంటూ.. ప్రశాంత్ తో పెట్టి జరిపించాలని వేడుకుంది. సుమారు గంటపాటు ప్రియుడు ఇంటి ముందు బైఠాయించడంతో స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించి ఆందోళన విరమించారు. అయితే ప్రియుడు ప్రశాంత్ తోపాటు కుటుంబ సభ్యులు ఎక్కడికి పోయారు అనేది ఇంకా క్లారిటీ రాలేదని పోలీసులు చెబుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Prabhas Maruthi Movie Update : గెట్ రెడీ అబ్బాయిలూ.. డార్లింగ్ గా మారనున్న డైనోసర్
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!