నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని పాత పోలీస్ స్టేషన్ భవనం పై నుంచి ఓ యువతి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రేమ పేరుతో తన ప్రియుడు సాయి కుమార్ మోసం చేశాడని, మనస్థాపం చెందిన గుండ్ల శ్రుతిక పోలీస్ స్టేషన్కు వచ్చి పిర్యాదు చేసింది. ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరింది. అయితే, ఆమె మనసులో ఉన్న ఆవేదన తీవ్రంగా ఉండటంతో పోలీస్ స్టేషన్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో శ్రుతికి నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తక్షణం ఆమెను రక్షించి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుండ్ల శ్రుతిక ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతోంది. పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Nizamabad: పోలీస్ స్టేషన్ భవనం పై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే?

Nizamabad