Yadadri Temple: రికార్డు స్థాయిలో యాదాద్రి ఆదాయం.. మెుత్తం కానుకలు రూ. 3.15 కోట్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yadadri Temple: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. యాదాద్రి ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా మారిందని చెప్పాలి. వారాంతంలో తెలంగాణ నుంచి లక్షలాది మంది యాదాద్రికి చేరుకుంటున్నారు. కొత్త ఆలయ దర్శనానికి కొంత మంది రాగా, మరికొందరు లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు తరలి వస్తుస్నారు. గత కొద్ది రోజులుగా యాదాద్రి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. దీంతో హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగింది. గత ఇరవై ఎనిమిది రోజుల్లో యాదాద్రికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు చెబుతున్నారు.
Read also: Giorgia Meloni: నెట్టింట మళ్లీ ట్రెండింగ్ లోకి #Melodi.. బీచ్ లో ఇటలీ ప్రధాని
Also Read
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
డిసెంబర్ నెలలో కార్తీక మాసం ముగింపు సందర్భంగా.. జనవరి 1న నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వేలాది మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ హుండీ ఆదాయం పెరిగింది. యాదాద్రి ఆలయ హుండీల ద్వారా రికార్డు స్థాయిలో రూ.3.15 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఈ మేరకు కొండ కింద ఉన్న ఆధ్యాత్మిక గ్రామంలోని శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రత మండపంలో గత 28 రోజులుగా భక్తులు సమర్పించిన నగదు, ఆభరణాల కానుకలను గురువారం లెక్కించారు. ఆభరణాల రూపంలో రూ.3,15,05,035 నగదు, 100 గ్రాముల బంగారం, 4,250 గ్రాముల వెండి వచ్చినట్లు ఈవో రామకృష్ణారావు తెలిపారు. యూఏఈ, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, నేపాల్, ఖతార్, థాయ్లాండ్, న్యూజిలాండ్, బ్రిటన్, సౌదీ అరేబియా, ఒమన్, మలేషియా దేశాల కరెన్సీ కూడా హుండీల ద్వారానే వచ్చినట్లు చెబుతున్నారు. నగదు ఆదాయం గతంలో రూ.2.5 కోట్లు కాగా ఈసారి రూ.3.15 కోట్లు వచ్చినట్లు ఈవో వెల్లడించారు.
World’s worst Rated Food: ప్రపంచంలోనే అత్యంత చెత్త ఆహారం ఏంటో తెలుసా?
తాజావార్తలు
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్ను పట్టించుకోడా?
-
King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Tamannaah Bhatia: ‘రాగిణి 3’ షూటింగ్ ప్రారంభం.. సెట్స్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!