Yadadri Temple: గుట్ట మీద భక్తుల బసకు ఏర్పాటు.. దాదాపు 200 వరకు గదులు..!
- యాదగిరిగుట్టపై దాదాపు 200 వరకు గదులను భక్తుల బసకు ఏర్పాట్లు..
- ఆలయ అభివృద్ధి పనులపై ఇటీవల సీఎం రేవంత్
- మంత్రి కొండా సురేఖ సమీక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yadadri Temple: యాదగిరిగుట్టపై దాదాపు 200 వరకు గదులను భక్తుల బసకు ఏర్పాట్లు చేపట్టారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులు వసతి పరంగా తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో.. కొత్తగా 200 గదులు నిర్మించాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. రాత్రి వేళల్లో కొండపై బస చేసి స్వామివారిని దర్శించుకునే భక్తులకు వసతి గదులు నిర్మించాలనే ప్రతిపాదనను ధార్మిక వ్యవహారాల శాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం అనుమతిస్తే దాతల సహకారంతో గదులు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శివాలయం వెనుక ప్రాంతంలో బాలాలయం స్థానంలో దాదాపు 200 గదులు నిర్మించే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే గుట్టపై భక్తులు బస చేసేందుకు శాశ్వత ఏర్పాట్లు చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం ఈ గుట్టపై గ్రీన్ హోటల్ గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవి పరిమితం కావడంతో భక్తులు కొండ కిందనే ఉండాల్సి వస్తోంది. తెల్లవారు జామున స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొనాలంటే కొండ కింద నుంచి పైకి రావాల్సిందే. అయితే ఉదయం పూట బస్సులు సమయానికి రాకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటికీ పరిష్కారంగా కొండపైన పెద్ద సంఖ్యలో గదులు ఏర్పాటు చేస్తే భక్తుల కష్టాలు తీరుతాయి. భక్తుల సౌకర్యాలతో పాటు ఆలయ అభివృద్ధి పనులపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ధార్మిక శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో అధికారులు సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు ప్రారంభించారు.
Atrocious: హైదరాబాద్ లో దారుణం.. ట్రావెల్ బస్సులో వివాహితపై అత్యాచారం..
Also Read
- Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Bank Turns Bar : వారెవ్వా.. బ్యాంక్ను బార్గా మార్చిన ఉద్యోగులు.. లిక్కర్ డిపాజిట్.. నిబంధనలు విత్డ్రా..!
- Yadadri Bhuvanagiri: నా చావుకు వారే కారణం.. ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న వివాహిత..!
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!