Yadadri Temple: గుట్ట మీద భక్తుల బసకు ఏర్పాటు.. దాదాపు 200 వరకు గదులు..!
- యాదగిరిగుట్టపై దాదాపు 200 వరకు గదులను భక్తుల బసకు ఏర్పాట్లు..
- ఆలయ అభివృద్ధి పనులపై ఇటీవల సీఎం రేవంత్
- మంత్రి కొండా సురేఖ సమీక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yadadri Temple: యాదగిరిగుట్టపై దాదాపు 200 వరకు గదులను భక్తుల బసకు ఏర్పాట్లు చేపట్టారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులు వసతి పరంగా తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో.. కొత్తగా 200 గదులు నిర్మించాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. రాత్రి వేళల్లో కొండపై బస చేసి స్వామివారిని దర్శించుకునే భక్తులకు వసతి గదులు నిర్మించాలనే ప్రతిపాదనను ధార్మిక వ్యవహారాల శాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం అనుమతిస్తే దాతల సహకారంతో గదులు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శివాలయం వెనుక ప్రాంతంలో బాలాలయం స్థానంలో దాదాపు 200 గదులు నిర్మించే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే గుట్టపై భక్తులు బస చేసేందుకు శాశ్వత ఏర్పాట్లు చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం ఈ గుట్టపై గ్రీన్ హోటల్ గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవి పరిమితం కావడంతో భక్తులు కొండ కిందనే ఉండాల్సి వస్తోంది. తెల్లవారు జామున స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొనాలంటే కొండ కింద నుంచి పైకి రావాల్సిందే. అయితే ఉదయం పూట బస్సులు సమయానికి రాకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటికీ పరిష్కారంగా కొండపైన పెద్ద సంఖ్యలో గదులు ఏర్పాటు చేస్తే భక్తుల కష్టాలు తీరుతాయి. భక్తుల సౌకర్యాలతో పాటు ఆలయ అభివృద్ధి పనులపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ధార్మిక శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో అధికారులు సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు ప్రారంభించారు.
Atrocious: హైదరాబాద్ లో దారుణం.. ట్రావెల్ బస్సులో వివాహితపై అత్యాచారం..
Also Read
- Bank Turns Bar : వారెవ్వా.. బ్యాంక్ను బార్గా మార్చిన ఉద్యోగులు.. లిక్కర్ డిపాజిట్.. నిబంధనలు విత్డ్రా..!
- Yadadri Bhuvanagiri: నా చావుకు వారే కారణం.. ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న వివాహిత..!
- Bhuvanagiri: ఓటు వేయలేదని ఓటర్ల ఇళ్లపై బీరు సీసాలతో దాడి
- Yadadri Scam: యాదాద్రిలో డాలర్స్ మాయం.. ఆడిట్లో బయటపడ్డ అసలు నిజం.!
తాజావార్తలు
-
Peddi: పెద్ది సినిమాలో విక్కీ కౌశల్ తండ్రి?
-
Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
-
Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
-
CM Vijay-Kamal haasan: సీఎం విజయ్తో కమల్హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
-
Malavika Mohanan: విజయ్తో నా బంధంపై అసభ్యకర ప్రశ్నలా?.. తమిళ మీడియాపై మాళవిక మోహనన్ ఫైర్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..