NTV Telugu Site icon

మంచిర్యాలలో దారుణం: భర్తకు కరోనా సోకిందని భార్య… 

దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది.  సెకండ్ వేవ్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.  రోజూ లక్షల కేసులు నమోదవుతున్నాయి.  జాగ్రత్తలు తీసుకుంటున్నా, మహమ్మారి ఏ మాత్రం తగ్గడం లేదు.  పైగా కరోనా దెబ్బకు కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయి.  ఒక ఇంట్లో ఒకరికి కరోనా సోకితే ఆ ప్రభావం మొత్తం ఇంటిపై పడుతున్నది.  తాజాగా మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో ఓ భర్తకు కరోనా సోకింది.  ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నాడు.  అయితే, భర్త కరోనా నుంచి కోలుకోడేమో అనే సందేహంతో అయన భార్య ఆత్మహత్య చేసుకుంది.  భర్త కరోనాతో ఆసుపత్రిలో ఉండటం, భార్య ఆత్మహత్య చేసుకోవడంతో బెల్లంపల్లిలో విషాదం నెలకొన్నది.