1. నేడు ఉదయం 11 గంటలకు ఏపీ పదోతరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. మార్కుల రూపంలో ఫలితాలను విద్యాశాఖ ప్రకటించనుంది.
2. నేడు ఏపీలో జనసేన విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు, ప్రస్తుత రాజకీయాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
3. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ సీనియర్ నేత డాక్టర్ కె.లక్ష్మణ్ నేడు హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు.
4. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నేడు ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
5. నేడు నరసరావుపేటకు టీడీపీ నేతలు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా నిన్న ఘర్షణలో మృతి చెందిన జల్లయ్య అంత్యక్రియల్లో టీడీపీ నేతలు పాల్గొననున్నారు.