Weather Update: తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ ఏమి చెప్పిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో వర్షాలు వదలడం లేదు. సోమవారం నుంచి వర్షాలు పడుతూనే వున్నాయి. ఎగువున కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మూసీ వరద ఉధృతికి శివారు ప్రాంతాలు మునిగిపోయాయి. తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ హెచ్చరికలు చేసింది వాతావరణ శాఖ. ఈ రోజు ఆవర్తనం ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళా ఖతంలో ఏర్పడి సగటు సముద్ర మట్టం నుండి 3.1 కిమీ ఎత్తు వరకు కొనసాగుతూ ఎత్తుకి వెళ్లే కొలది దక్షిణ దిశ వైపుకి వంపు తిరిగి ఉంది.
నిన్న రాజస్థాన్, పరిసర ప్రాంతం నుండి మధ్యప్రదేశ్, తూర్పు విదర్భ, దక్షిణ చ్ఛాట్టిస్ ఘడ్ మరియు ఆంధ్రప్రదేశ్ తీరం* వెంబడి ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళా ఖతం వరకు ఉన్న ద్రోణి ఈ రోజు బలహీన పడింది. . ఉత్తర దక్షిణ ద్రోణి రాయలసీమ నుండి తమిళనాడు మీదుగా కొమరం ప్రదేశం వరకు ఉన్న ద్రోణి ఈ రోజు బలహీన పడింది. రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు చేసింది. రాగల మూడు రోజులు తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది, రాగల మూడు రోజులు తెలంగాణా రాష్ట్రంలో భారీ వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
Also Read
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
- CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
- Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
Star Hero’s Remuneration: అగ్రహీరోల కీలక ప్రకటన.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటామని హామీ
ఇదిలా వుంటే అంబర్ పేట్ లోని మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద పరిస్థితిని సమీక్షించారు అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు. ఎగువ భాగం నుండి వస్తున్న వరదలతో తక్కువ ఎత్తు ఉండడంతో మూసారం బ్రిడ్జి మునుగుతుందన్నారు. దిల్ సుఖ్ నగర్, అంబర్ పేట్ ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు బ్రిడ్జ్ ప్రధాన రహదారి. ఈ బ్రిడ్జి పై ఫ్లై ఓవర్ తరహాలో హై లెవెల్ బ్రిడ్జి 52 కోట్లతో నిర్మిస్తాం. మరో రెండు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు ఎమ్మెల్యే వెంకటేష్. ఉదయం బ్రిడ్జిపై నుంచి భారీగా వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిపివేశారు. ఇప్పుడా బ్రిడ్జిపై వరద ప్రవాహం తగ్గింది.
తాజావార్తలు
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
-
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!