Vemulawada: భక్తులు అలర్ట్.. వేములవాడ రాజన్న ఆలయం మూసివేత.. ఎందుకంటే..?
Vemulawada: మరో అరుదైన ఘటనకు ప్రపంచం సిద్ధమవుతోంది! ఈ నెల 29న చంద్రగ్రహణం ఏర్పడనుంది. సూర్యగ్రహణం పూర్తయిన 14 రోజుల తర్వాత చంద్రగ్రహణం ఏర్పడడం గమనార్హం. ఒకే నెలలో రెండు గ్రహణాలు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈనేపథ్యంలో.. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల (28-10-2023) శనివారం మధ్యాహ్నం 1.16 నుంచి 1.51 గంటల వరకు రాహు గ్రస్త చంద్రగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో రాజన్న ప్రధాన ఆలయానికి అనుబంధంగా ఉన్న ఆలయాలను కూడా మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. శనివారం సాయంత్రం 4:15 pm నుండి ఆదివారం గ్రహణం తర్వాత (29-10-2023) ఆలయాలకు తిరిగి, గ్రహణం అనంతరం 3:40 నిమిషాలకు సుప్రభాత పూజలు నిర్వహించి, భక్తులకు దర్శనం కోసం సేవలు ప్రారంభిస్తారు. గ్రహణం సందర్భంగా ఆదివారం ఆలయంలో జరిగిన కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.
లోకకళ్యాణార్థం శ్రీరాజరాజేశ్వర స్వామివారి క్షేత్రంలో ప్రతిరోజు నాలుగుసార్లు స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు దూరప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకుని.. ముందుగా పుష్కరిణిలో స్నానమాచరించాలి. స్వామివారికి ఇష్టమైనవాటిని చెల్లించి సేవల్లోకి ప్రవేశిస్తారు. గ్రహణ సమయంలో గర్భిణులు భోజనం చేయరాదని, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని పురోహితులు సూచిస్తున్నారు.
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
ఈ నెల 29న చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆ రోజు తెల్లవారుజామున 1.05 గంటల నుంచి 2.22 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. దీంతో 28వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 29వ తేదీ తెల్లవారుజామున 3 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. చంద్రగ్రహణం కారణంగా 28న సహస్ర దీపాలంకరణ సేవ, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. శనివారం 87,081 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.4.05 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. మొత్తం 41,757 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. రద్దీ దృష్ట్యా అక్టోబర్ 1, 7, 8, 14, 15 తేదీల్లో సర్వదర్శనం టోకెన్లను నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
Big Breaking: బీజేపీకి కోమటిరెడ్డి రాజీనామా.. ఎల్లుండి కాంగ్రెస్లోకి..!
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!