Uttam Kumar Reddy: అవినీతిరహిత, పారదర్శక పాలన అందజేస్తాం: ఉత్తమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar Reddy: నా శాఖలైన నీటిపారుదల, పౌర సరఫరాల శాఖలో అవినీతి రహిత, పారదర్శకంగా, జవాబుదారితనంతో పాలన అందజేస్తామని నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలకు నూతన శకం మొదలైంది. ప్రజలందరికీ హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 60 ఏళ్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటం తర్వాత 2014 కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు చేసిందన్నారు. ప్రజలకు రాష్ట్రం వచ్చింది కానీ దురదృష్టవశాత్తు టిఆర్ఎస్ ప్రభుత్వం రావడం ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్రం రాలేదన్నారు. పదేళ్ల నిర్బందాలు, నియంత పాలనను పారద్రోలి ప్రజలు మళ్ళీ ఒక ప్రజాస్వామ్య పాలనకు అంకురార్పణ చేశారని అన్నారు. ప్రజా పాలన మొదలు కావడంతో స్వచ్ఛగా బతుకుతున్నారు. రాష్ట్రములో ఒక పండుగ వాతావరణం ఏర్పడిందన్నారు. సచివాలయంలో ప్రజలు స్వేచ్ఛగా వచ్చి వారి విజ్ఞప్తులను అందజేస్తున్నారని తెలిపారు.
Read also: Health Tips : హ్యాంగోవర్ నుంచి బయటపడాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..
Also Read
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
- CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
ప్రజా భవన్ ప్రజల అవసరాలకు ఉపయోగపడుతుందని అన్నారు. శాసనసభలో ప్రతిపక్ష, అధికారపక్ష సభ్యులు ప్రజల కోసం అంశాల వారిగా చర్చిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు అవుతున్నాయని తెలిపారు. ఇలాంటి పాలన కోసమే ప్రజలు తెలంగాణ కోసం పోరాటం చేసి సాధించుకున్నారని అన్నారు. గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు, అవినీతి పాలు చేసి దివాళా తీశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ప్రజలకు మేలు చేసే విదంగా ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. నా శాఖలైన నీటిపారుదల, పౌర సరఫరాల శాఖలో అవినీతి రహిత, పారదర్శకంగా, జవాబుదారితనంతో పాలన అందజేస్తా అన్నారు. ప్రజలకు తప్పకుండా ప్రజా పాలన అందిస్తామన్నారు.
Vidadala Rajini: మంత్రి విడుదల రజిని కార్యాలయంపై రాళ్ల దాడి.. పోలీసుల అదుపులో టీడీపీ-జనసేన కార్యకర్తలు!
తాజావార్తలు
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!