Uttam Kumar Reddy: గ్యాస్‌పై తెలంగాణ ప్రజలకు ఊరట.. మంత్రి కీలక ప్రకటన..

  • గ్యాస్ కొరతపై మంత్రి స్పష్టత
  • గృహ వినియోగదారులకు సరిపడా సిలిండర్లు
  • కమర్షియల్ గ్యాస్ కొరతకు కేంద్ర గైడ్‌లైన్స్ కారణం
  • అక్రమ నిల్వలపై ప్రత్యేక కమిటీల ఏర్పాటు
Uttam Kumar

Uttam Kumar

తెలంగాణలో ఎల్పీజీ గ్యాస్ కొరత ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. గృహ అవసరాలకు వాడే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, కేవలం కమర్షియల్ సిలిండర్ల విషయంలోనే కొంత కొరత ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ , ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

రాష్ట్రవ్యాప్తంగా 1.3 కోట్ల మంది యాక్టివ్ గృహ వినియోగదారులు ఉన్నారని, వారికి సరిపడా సిలిండర్లను ఆయిల్ కంపెనీలు అందిస్తున్నాయని మంత్రి తెలిపారు. గతంలో రోజుకు సగటున 2.15 లక్షల సిలిండర్లు సరఫరా అయ్యేవని, ప్రస్తుత డిమాండ్‌ను బట్టి దానిని 2.3 లక్షలకు పెంచినట్లు ఆయన వెల్లడించారు. గ్యాస్ కొరత ఉందన్న ఆందోళనతో వినియోగదారులు అనవసరంగా ఓవర్ బుకింగ్ చేసి సిస్టమ్‌ను ఓవర్‌లోడ్ చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

Cockroach: బాబోయ్ ఇవి బొద్దింకలు కావు.. కొత్త తరం గూఢాచారులు!

హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలు వాడే 19 కేజీల కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో మాత్రం తగ్గుదల ఉన్న మాట వాస్తవమేనని మంత్రి అంగీకరించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కొత్త మార్గదర్శకాల వల్ల గతంలో ఉన్న సరఫరాలో కేవలం 20 శాతం మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉందని ఆయన వివరించారు. గతంలో రోజుకు 23,000 కమర్షియల్ సిలిండర్లు సరఫరా అయ్యే చోట, ఇప్పుడు కేవలం 6,200 మాత్రమే వస్తున్నాయని, ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని ఆయన హామీ ఇచ్చారు.

Father Property: తండ్రి ఆస్తులు అన్నీ కొడుకువి కావు.. సంచలన తీర్పు ఇచ్చిన హైకోర్టు..

రాష్ట్రంలో గ్యాస్ పంపిణీ సక్రమంగా జరిగేలా చూడటంతో పాటు, అక్రమ నిల్వలను అరికట్టేందుకు రాష్ట్ర , జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. గృహ అవసరాల సిలిండర్లు పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మొత్తానికి, సామాన్యుడి వంటింట్లో మంట ఆరిపోకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని ఆయన భరోసా ఇచ్చారు.