NTV Telugu Site icon

హుజురాబాద్ లాంటి ఎన్నికలు గతంలో ఎక్కడా చూడలేదు

జన ఆశీర్వాద యాత్రలో భాగంగా భువనగిరి పట్టణానికి చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… జమ్మూకాశ్మీర్ లో 370 కి వ్యతిరేకంగా పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టాం..దాన్ని రద్దు చేసుకొని, భారత రాజ్యాంగం పరిధిలోకి తీసుకురావటం కీలక ఘట్టం..నా జీవితంలో ఇది కీలక నిర్ణయం.. క్యాబినెట్ మంత్రిగా నాకు మోడీ అవకాశం కల్పించారు. ఈశాన్య రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నాం. ఆయా రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం.. ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్గానిక్ వ్యవసాయం చేసేలా ప్రోత్సాహిస్తున్నాము అన్నారు.

ఇక కోవిడ్ కారణంగా దేశానికి పర్యాటకులు విదేశాల నుంచి రాలేదు. జిడిపి 5 శాతం మాత్రమే పర్యాటకం నుంచి ఉంటుంది.. మన దేశంలో పర్యాటక రంగాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. జనవరి నుంచి మళ్ళీ పర్యాటకం ప్రారంభిస్తాము. మన దేశంలో అద్భుతమైన పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో న్యూజిలాండ్ లాంటి సుందర ప్రదేశాలు ఉన్నాయి. డిసెంబర్ లోపు కరోనా వ్యాక్సినేషన్ చాలా వరకు పూర్తి అవుతుంది. మన రాష్ట్రం లో ప్రజల పండగలు ,బతుకమ్మ, గిరిజన పండగలు సమ్మక్క సారక్క జాతరాలు జరుగుతున్నా యి…వచ్చే రెండేళ్లలో వాటిని గుర్తించనున్నాం… వాటన్నింటినీ చిత్రీకరించి టూరిజం స్పాట్ లుగా చేయనున్నాం. 40 యునెస్కో గుర్తింపు పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. వాటిలో మౌలిక వసతులు కల్పించనున్నాం. ఆర్కియాలజీ కట్టడాలను వాటన్నిటినీ భద్రపరిచి భావితరాలకు తెలిసేలా కృషి చేస్తాం. దేశంలో 3700 ల మాన్యుమెంట్స్ ఉన్నాయి. భువనగిరి కోటకు ప్రత్యేక ఉంది. రోప్ వే ద్వారా అభివృద్ధి చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. హుజురాబాద్ లాంటి ఎన్నికలు గతంలో ఎక్కడా చూడలేదు. కుటుంబ రాజకీయాలు చేసేవారిని తెలంగాణ ప్రజలు తిప్పికొడుతారు అని పేర్కొన్నారు.