మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత మూడు రోజుల క్రితం ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ప్రస్తుతం కోలుకోవడంతో వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు. అయితే ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన అనంతరం లైంగిక వేధింపుల వివాదంపై మాట్లాడేందుకు ఉదయ్ కృష్ణారెడ్డి తీవ్రంగా నిరాకరించారు.
మరొకవైపు ఈ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. బాధితురాలైన మహిళా ట్రైనీ ఐపీఎస్ నుంచి షీ టీమ్ (SHE Team) అధికారులు ఇప్పటికే పూర్తయిన వివరాలతో కూడిన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. కాగా తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ ఉదయ్ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా, ఈ పిటిషన్పై విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది.

