Congress First List: ఉత్తమ్, మైనంపల్లి కుటుంబాలకు రెండేసి టిక్కెట్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress First List: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఉదయం విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ ఈ ఉదయం 55 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ రెండు టిక్కెట్లు కేటాయించింది. మైనంపల్లి హన్మంతరావు ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులకు రెండు అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించింది.
కాంగ్రెస్ పార్టీ పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతికి టికెట్లు కేటాయించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, కోదాడ నుంచి పద్మావతికి టిక్కెట్లు కేటాయించింది. హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. కోదాడ నుంచి పోటీ చేసిన పద్మావతి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. గత నెలలోనే కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించింది. మైనంపల్లి హన్మంతరావుకు మల్కాజిగిరి టికెట్ కేటాయించారు. మెదక్ నుంచి హన్మంతరావు కుమారుడు రోహిత్రావుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది.
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుంచి మైనంపల్లి హన్మంతరావుకు బీఆర్ఎస్ టికెట్ కేటాయించింది. అయితే తన కుటుంబానికి రెండు టిక్కెట్లు ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరారు. మైనంపల్లి హన్మంతరావుకు మల్కాజిగిరి అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే బీఆర్ఎస్ కేటాయించింది. దీంతో ఆయన బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయారు. రెండు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సానుకూల హామీ రావడంతో మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇచ్చిన మాట ప్రకారం మైనంపల్లి హన్మంతరావు కుటుంబానికి రెండు టిక్కెట్లు కేటాయించారు.
జానారెడ్డి కుటుంబం కూడా రెండు టిక్కెట్లు ఆశించింది. జానా రెడ్డి పెద్ద కుమారుడు జయవీర్ రెడ్డికి నాగార్జునసాగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. మిర్యాలగూడ నుంచి చిన్న కుమారుడు రఘువీర్కు టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. అయితే పొత్తు కారణంగా మిర్యాలగూడ సీటును సీపీఎం కోరుతోంది. మిర్యాలగూడ టిక్కెట్టు జానా రెడ్డి కుటుంబానికి కేటాయిస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. గత ఎన్నికల సమయంలో నాగార్జునసాగర్తో పాటు మిర్యాలగూడ టికెట్ కూడా జానారెడ్డి అడిగారు. కానీ చివరి నిమిషంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కాంగ్రెస్ పార్టీ కృష్ణయ్యకు టికెట్ కేటాయించింది. మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ కృష్ణయ్యను పోటీకి దింపింది. దీంతో నాగార్జున సాగర్ నుంచి జానా రెడ్డి మాత్రమే పోటీ చేయాల్సి వచ్చింది.
మైనంపల్లి హన్మంతరావు కుటుంబానికి రెండు టిక్కెట్లు కేటాయించడం ఉదయపూర్ డిక్లరేషన్కు భిన్నంగా ఉందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఒకే కుటుంబంలో రెండో టికెట్ కేటాయింపునకు సంబంధించి కొన్ని నిబంధనలు రూపొందించారు. కనీసం ఐదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఉండాలి. అయితే గత నెలలోనే కాంగ్రెస్లో చేరిన మైనంపల్లి హన్మంతరావు కుటుంబానికి రెండు టిక్కెట్లు కేటాయించడం చర్చకు దారితీసింది. అయితే పార్టీ అగ్రనేతలు రాహుల్, సోనియా గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఉదయ్ పూర్ డిక్లరేషన్ ను పక్కనబెట్టి టికెట్లు కేటాయించే వెసులుబాటు కూడా ఉందని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్గా రిషభ్ పంత్..
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!