NTV Telugu Site icon

వనస్థలిపురం అగ్ని ప్రమాదం కేస్ లో ట్విస్ట్…

వనస్థలిపురం అగ్ని ప్రమాదం కేస్ లో మలుపు చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంలో నిజం లేదని తేల్చింది ఫైర్ సిబ్బంది. ప్రభుత్వ ఉద్యోగి సరస్వతి బలవన్మరణానికి పాల్పడ్డింది. భార్య భర్త మధ్య గొడవ కారణంగా తనంతట తానే ఒంటికి నిప్పు అంటించుకుంది భార్య. ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేసి గాయాల పాలయ్యాడు భర్త బాలకృష్ణ. అయితే ఒక్కసారిగా మంటలు రావడం చూసి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు స్థానికులు. అయితే ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదం కాదని తేల్చింది ఫైర్ సిబ్బంది. భార్య మృత దేహాన్ని కి పోస్ట్ మార్టం నిర్వహించాకా నిజం బయట పడింది. నిప్పు అంటిచుకోడం తోనే మృతి చెందినట్టు తేల్చారు వైద్యులు. ఇక ప్రస్తుతం మాట్లాడలేని స్థితిలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు భర్త బాలకృష్ణ.