Hawala money: రెజిమెంటల్ బజార్ అగ్ని ప్రమాద ఘటనలో ట్విస్ట్.. బయటపడిన హవాలా సొమ్ము
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hawala money: సికింద్రాబాద్లోని రెజిమెంటల్ బజార్లోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాద ఘటనలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అగ్నిప్రమాదం జరిగిన ఇంట్లో పోలీసులు కోటి రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇవి హవాలా సొమ్ముగా పోలీసులు అనుమానిస్తున్నారు. 1.64 కోట్ల నగదు, భారీగా బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యజమాని శ్రీనివాస్ ప్రస్తుతం హైదరాబాద్లో లేడు. పని చేసే ప్రాంతానికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ ఓ కంపెనీలో డీజీఎంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ ప్రభుత్వ విద్యుత్ వ్యాపారం కాంట్రాక్టు పనులు కూడా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అగ్ని ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకుని అగ్ని ప్రమాదం జరిగిన ఇంటిని పరిశీలించారు. ఇంట్లోకి వెళ్లి చూసే సరికి హవాలా నగదు కుప్ప కనిపించింది. దీంతో స్థానిక పోలీసులు ఐటీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగి హవాలా సొమ్ముపై ఆరా తీస్తున్నారు. హవాలా లావాదేవీల వ్యవహారంలో శ్రీనివాస్ పై దృష్టి సారించారు. మీరు ఏదైనా హవాలా వ్యాపారం చేస్తున్నారా? హవాలా డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎన్ని రోజులు జరుగుతుంది? ఐటీ దర్యాప్తు చేస్తోంది. ఐటీ అధికారుల విచారణలో మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.
Read also: Weather Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. రానున్న మూడు రోజులు హీటెక్కించనున్న ఎండలు
Also Read
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
సికింద్రాబాద్లోని రెజిమెంటల్ బజార్లోని ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. చెక్క ఫర్నీచర్ ఉండడంతో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు ఇల్లంతా వ్యాపించడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. చుట్టుపక్కల ప్రాంతాలకు పొగ వ్యాపించడంతో అంతా అంధకారంగా మారింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. మంటలు అదుపులోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని గుర్తించారు. కాగా ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేసినట్లు తెలుస్తోందని అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.
Ponzi Scam : స్కీం పేరుతో స్కాం.. దంపతులకు 12,640ఏళ్ల జైలు శిక్ష
తాజావార్తలు
-
Job Crisis Explained: ఇంజినీర్లు, డాక్టర్లు ఉన్నారు కానీ ప్లంబర్లు లేరు..ఇండియాలో ఈ సైలెంట్ సంక్షోభానికి కారణమేంటి?
-
Viral News: 3 రోజుల్లో ఒంటరిగా 6000కిలోమీటర్ల ప్రయాణం.. RCB కోసం మహిళా ఫ్యాన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!
-
KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
-
Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 10 మంది మృతి, పలువురికి గాయాలు.!
-
Layoffs: జాబ్స్కు రెడ్ అలెర్ట్.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఎందుకు ఊడుతున్నాయ్..? కాగ్నిజెంట్ నివేదికలో ఏముంది?
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!