Basara IIIT: లిఖిత మృతి కేసులో ట్విస్ట్.. మూడవ ఫ్లోర్ లో చిక్కుకుని కాపాడాలని అరిచిన విద్యార్థిని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Basara IIIT: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని లిఖిత మృతిపై బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. లిఖిత నాలుగో ఫ్లోర్ నుంచి కింద పడుతున్నప్పుడు ఏం జరిగిందో విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. హాస్టల్ లోని నాల్గవ ఫ్లోర్ నుంచి ప్రమాదవసాత్తు విద్యార్థిని లిఖిత పడిపోయిందని వార్తులు వచ్చాయి. అయితే ఈ క్రమంలో అలిఖత కిందికి పడి పోతున్న క్రమంలో మూడవ ఫ్లోర్ వద్ద చిక్కుకుంది. లిఖిత వేలాడుతూ కాపాడండి అంటూ అరిచింది. దీంతో కాపాడండి అంటూ అరుపులు వినపడటంతో విద్యార్థినికులు భయాందోళనకు గురయ్యారు.
Read also: Perni Nani Vs Pawan Kalyan: మాకు లేవా చెప్పులు..? రెండు చెప్పులు చూయించిన నాని..
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
ఎక్కడి నుంచి ఈ అరుపులు వస్తున్నాయె మెల్లగా బయటకు రాగా.. విద్యార్థినిలకు లిఖిత మూడో ఫ్లోర్ వేలాడుతూ కనిపించింది. విద్యార్థినులకు ఎలా కాపాడాలో ఏమీ అర్థంకాలేదు. లిఖిత కాపాడండి అని దీనంగా ఏడుస్తూ అరుస్తున్నా నిర్ఘాంతపోయి చూసారే తప్పా ఏమీ చేయలేకపోయారు మిగతా విద్యార్థినులు. మూడో ఫ్లోర్ రో చిక్కుకున్న లిఖిత అక్కడి నుంచి కిందికి పడిపోయింది. అక్కడ వున్న విద్యార్థినులు కళ్ళ ముందే లిఖిత కిందపడిపోవడంతో విద్యార్థినిలు అక్కడే వున్న సిబ్బందికి సమాచారం అందించారు. అయితే కింద పడ్డా లిఖిత నొప్పిగా ఉందంటూ బాధపడుతున్న ఎవరూ ఏమీ చేయలేక పోయారు. లిఖిత కింద పడిన తరువాత దాదాపు 20 నిమిషాలకు ట్రిపుల్ ఐటీ నుంచి అంబులెన్సు లో భైంసా కు తరలించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 20 నిమిషాల ముందే లిఖితకు వైద్యం అందించి ఉంటే లిఖిత బతికేదని విద్యార్థినులు చెబుతున్నారు. అసలు లిఖిత ఎందుకు నాలుగో ఫ్లోర్ వెళ్లిందో అర్థం కావడం లేదని అంటున్నారు.
వైసీపీ స్పందన..
ట్రిపుల్ ఐటీ విద్యార్థిని లిఖిత మృతిపై వీసీ వెంకటరమణ స్పందించారు. ప్రమాదవశాత్తు లిఖిత మృతి చెందినట్లు అన్నారు. లిఖిత ఫోన్ చూస్తుండగానే భవనంపై నుంచి జారిపడిందని చెప్పాడు. ప్రమాదంలో లిఖిత వీపు భాగం దెబ్బతిందని తెలిపారు. విద్యార్థుల మృతి బాధాకరమని వీసీ వెంకటరమణ అన్నారు. మరోవైపు ట్రిపుల్ ఐటీ వీసీ జిల్లా ఆస్పత్రికి చేరుకుని విద్యార్థి లిఖిత మృత దేహాన్ని పరిశీలించారు. అయితే ఆస్పత్రికి వచ్చిన వీసీని లఖిత కుటుంబ సభ్యులు నిలదీశారు. మీ నిర్లక్ష్యం వల్లే పిల్లలు చనిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
House Rates: హైదరాబాద్లో పెరిగిన ఇళ్ల ధరలు
తాజావార్తలు
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్కు రంగం సిద్ధం!
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!