NTV Telugu Site icon

CM Revanth Reddy: హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి 10 ఏసీ బస్సులు.. నేడు ప్రారంభించనున్న సీఎం

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలలో శ్రీశైలం ఒకటి. చాలా మంది ఈ క్షేత్రాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త అందించింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం క్షేత్రానికి వెళ్లే ఆధ్యాత్మిక పర్యాటకులకు ఆర్టీసీ కొత్త ప్రయాణాన్ని అందించనుంది. ఇప్పటి వరకు ఈ మార్గంలో ఏసీ బస్సులు లేవు. నాన్-ఏసీ బస్సులు మాత్రమే తిరుగుతాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్-శ్రీశైలం మధ్య 10 ఏసీ బస్సులను ప్రవేశపెట్టాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ కొత్తగా 85 బస్సులను ప్రవేశపెట్టనుంది. 75 ఎక్స్‌ప్రెస్ బస్సులు, 10 ఏసీ బస్సులు ఉన్నాయి.

Read also: Anil Ambani : అనిల్ అంబానీకి పెద్ద దెబ్బ.. మూడు నెలల్లో భారీ నష్టం

ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఈ కొత్త బస్సులను ప్రారంభించనున్నారు. హైదరాబాద్ శ్రీశైలం రూట్లో ఏసీ బస్సులు లేకపోవడంతో చాలా మంది ప్రయాణికులు సొంత కార్లు, అద్దె వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం వేసవి కాలం మొదలైంది. ఈ సమయంలో ఏసీ బస్సులు అందుబాటులో ఉండడం వల్ల ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. ‘రాజధాని’ బస్సు పొడవుగా ఉండడంతో ఘాట్ రోడ్ల వద్ద చుట్టూ తిరగడం కష్టంగా మారింది. దీంతో కొన్నాళ్లుగా సూపర్ లగ్జరీ బస్సులతో సరిపెట్టుకుంది. తాజాగా- ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని బస్సు సూపర్ లగ్జరీ బస్సులో తయారు చేయబడింది.
Haldwani Violence: హల్ద్వానీలో ఉద్రిక్తత.. రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన రవాణా వ్యవస్థ..