Site icon NTV Telugu

కొత్తగా తెలంగాణలో 577 కరోనా కేసులు…

corona

తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులు కాస్త పెరిగాయి.. 1,11,226 శాంపిల్స్‌ పరీక్షించగా… 577 మందికి పాజిటివ్‌గా తేలింది… మరో ఇద్దరు కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 645 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,48,388 కు చేరగా… కోలుకున్నవారి సంఖ్య 6,35,895 కి పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు కరోనాతో రాష్ట్రంలో 3,819 మంది మృత్యువాతపడ్డారు.. ప్రస్తుతం 8,674 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం. ఇక తెలంగాణలో కరోనా రికవరీ కేసుల సంఖ్య 98.07 శాతంగా ఉంది.

Exit mobile version