Site icon NTV Telugu

తెలంగాణలో 200 దాటినా కరోనా కేసులు…

తెలంగాణలో కరోనా రోజువారి కేసులు నేడు భారీగా పెరిగాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 39,495 శాంపిల్స్‌ పరీక్షించగా… 213 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మరో ఒక్క కరోనా బాధితుడు మృతిచెందారు. ఇదే సమయంలో 156 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,76,787కు చేరుకోగా… రికవరీ కేసులు 6,69,010కు పెరిగాయి.. ఇక, మృతుల సంఖ్య 3,998కు చేరినట్టు బులెటిన్‌లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,779 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.. తాజా, కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 62 కొత్త కేసులు వెలుగు చూశాయి.

Exit mobile version