Site icon NTV Telugu

తెలంగాణలో స్థిరంగా కరోనా కేసులు…

తెలంగాణ కరోనా పాజిటివ్‌ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 36,900 శాంపిల్స్‌ పరీక్షించగా… 201 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో ఒక్క కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో.. 184 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో… మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,77,747కు పెరగగా.. రికవరీ కేసులు.. 6,69,857కు చేరాయి.. ఇక, మృతుల సంఖ్య 4,003కు పెరిగింది.. ప్రస్తుతం 2,128 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు సర్కార్‌ వెల్లడించింది. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 82 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

Exit mobile version