Site icon NTV Telugu

తెలంగాణలో కొత్తగా 193 కరోనా కేసులు…

తెలంగాణ కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 42,367 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 193 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి.. మరో వ్యక్తి కోవిడ్‌ బారినపడి మృతిచెందాడు.. ఇదే సమయంలో.. 196 కోవిడ్‌ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,69,932 కి చేరగా.. రికవరీ కేసులు 6,62,025 కి పెరిగాయి.. ఇక, మృతుల సంఖ్య 3,944 కు పెరిగిందని.. ప్రస్తుతం రాష్ట్రంలో 3,963 ​యాక్టివ్‌ కేసులు ఉన్నాయి బులెటిన్‌లో పేర్కొన్నారు

Exit mobile version