తెలంగాణలో కరోనా రోజువారి కేసులు పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 40,018 శాంపిల్స్ పరీక్షించగా… 193 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో కరోనా బాధితుడు మృతిచెందారు. ఇదే సమయంలో 153 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,76,187కు చేరుకోగా… రికవరీ కేసులు 6,68,564కు పెరిగాయి.. ఇక, మృతుల సంఖ్య 3,993కు చేరినట్టు బులెటిన్లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,630 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. తాజా, కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 73 కొత్త కేసులు వెలుగు చూశాయి.
తెలంగాణ కరోనా అప్డేట్..
