తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈరోజు తగ్గింది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 25,693 శాంపిల్స్ పరీక్షించగా… 156 మందికి కరోనా పాజిటివ్గా తేలింది.. మరో ఒక్క కరోనా బాధితుడు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో.. 147 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,76,943కు చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 6,69,157కు పెరిగింది. ఇక, ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి మృతిచెందిన వారి సంక్య 3,999కు చేరినట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 70 కేసులు వెలుగు చూశాయి.
తెలంగాణలో నేడు తగ్గిన కరోనా కేసులు…
