NTV Telugu Site icon

Tirupati Reddy: హాట్ కేక్‎లా మెదక్ అసెంబ్లీ టిక్కెట్.. కాంగ్రెస్ పార్టీకి తిరుపతి రెడ్డి రాజీనామా..!

Tirupati Reddy

Tirupati Reddy

డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి ఆదివారం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. మెదక్ అసెంబ్లీ టిక్కెట్‌ను తిరుపతిరెడ్డి ఆశించారు. అయితే ఈ స్థానం నుంచి మైనంపల్లి హన్మంతరావు తనయుడు రోహిత్‌కు టిక్కెట్టు దక్కే అవకాశం ఉండటంతో కాంతారెడ్డి తిరుపతిరెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.

మైనంపల్లి హన్మంతరావు గత వారం బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 28న న్యూఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. మల్కాజిగిరి నుంచి మైననంపల్లి హన్మంతరావు, మెదక్ నుంచి హన్మంతరావు కుమారుడు రోహిత్ కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు. మైనంపల్లి హన్మంతరావు 2009-2014 వరకు మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. రోహిత్ కొంతకాలంగా మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రోహిత్ మెదక్ అసెంబ్లీ స్థానంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మెదక్‌ నుంచి బీఆర్‌ఎస్‌ టికెట్‌ తన కుమారుడు రోహిత్‌కు ఇవ్వాలని మైనంపల్లి హన్మంతరావు బీఆర్‌ఎస్‌ నాయకత్వాన్ని కోరారు. కానీ, బీఆర్‌ఎస్‌ నాయకత్వం సానుకూలంగా స్పందించలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి టికెట్ కేటాయించారు.

దీంతో మంత్రి హరీశ్ రావుపై మైనంపల్లి హన్మంతరావు విమర్శలు గుప్పించారు. మల్కాజిగిరి, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన అనుచరులతో సమావేశాలు నిర్వహించి మైనంపల్లి హన్మంతరావు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. అయితే మైనంపల్లి హన్మంతరావు కుమారుడికి మెదక్ అసెంబ్లీ టికెట్ కేటాయించే అవకాశం ఉందని తేలడంతో తిరుపతిరెడ్డి కాంగ్రెస్‌ను వీడారు. డబ్బు మూటలు ఇచ్చిన వారికే పార్టీ టిక్కెట్లు ఇస్తారా లేక కర్ణాటక మాదిరి కాదా అని ప్రశ్నించారు. ఎంతో కాలంగా పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా డబ్బున్న వారికి టిక్కెట్లు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. పార్టీ అభ్యర్థిగా మొదట హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఇప్పుడు వేరొకరికి టికెట్ కేటాయించడంపై తిరుపతిరెడ్డి ప్రశ్నించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పంపిన రాజీనామా లేఖలో ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు.
Tiger Nageswara Rao: ‘హేమ లత లవణం’గా రేణు దేశాయ్…