Municipal in Illandu: ఇల్లందులో మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం.. రంగంలోకి పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Municipal in Illandu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాసం వీగిపోయేటట్లు చేసేందుకు కాంగ్రెస్ శతవిధాల ప్రయత్నం చేస్తుంది .ఇల్లందుకి చుట్టూ ఉన్న మూడు జిల్లాలకు సంబంధించిన పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగింది. మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల సరిహద్దులో కౌన్సిలర్ల కోసం పెద్ద ఎత్తున నిఘా పెట్టి వారికోసం తనిఖీలు చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 11 గంటల సమయంలో ఇల్లందు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ పై బిఆర్ఎస్ అవిశ్వాసం పెట్టింది. గతంలోనే రెండుసార్లు అవిశ్వాసం పెట్టినప్పటికీ అప్పుడున్న అధికార పార్టీ అవిశ్వాసం కౌన్సిల్ లో చర్చకు రాకుండా చేసింది .కానీ ఇప్పుడు మళ్లీ అవిశ్వాసం పెట్టడంతో జిల్లా కలెక్టర్ అవిశ్వాసం పై చర్చకు ఆదేశాలు జారీ చేయగా ఈరోజు కొద్దిసేపట్లో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ డి వెంకటేశ్వర రావు ఫై అవిశ్వాసం ఓటింగ్ జరగనుంది. అయితే 24 కౌన్సిలర్ ఎమ్మెల్యే కో ఆప్షన్ తో కలుపుకుని 25 మంది వార్డు సభ్యులు ఉండగా అందులో 17 మంది హాజరై తేనే కోరం పూర్తయినట్లు.. 17 మందిలో ఒక్కలు తగ్గిన సరే అవిశ్వాసం వీగిపోయినట్లే అవుతుంది.
Read also: CM Revanth Reddy: నేడు రాంచీకి రేవంత్.. న్యాయ్ యాత్రలో పాల్గొననున్న సీఎం..
Also Read
- Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
- Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
- NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
అలా విగి పోయే విదముగా కాంగ్రెస్ వ్యూహం పన్నింది. ఈ నేపథ్యంలో అవిశ్వాసానికి నోటీసు ఇచ్చిన 17 మందిలో కొద్దిమందిని రాకుండా చేయడం ద్వారా అధికార కాంగ్రెస్ వ్యూహము అనుసరిస్తుంది .ఇప్పటికే గోవా క్యాంపులో ఉన్న కౌన్సిలర్లు రాకుండా చేయడం కోసం పోలీసు యంత్రాంగం కూడా రంగంలోకి దిగిన పరిస్థితి ఇల్లందుకు వెళ్లే వాహనాన్ని ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు కారులు వాళ్ళని ఆపి తనిఖీ చేసి ఇల్లందుకి వెళ్తున్నారా అని ఆచూకీ తెలుసుకుంటున్నారు అయితే ఇప్పటివరకు బిఆర్ఎస్ కు సంబంధించిన కౌన్సిలర్లు ఎక్కడ ఉన్నదనేది అధికార కాంగ్రెస్ పార్టీ కని పెట్టలేకపోయింది. మరోవైపున తమకి రక్షణ కల్పించాలని కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు .అంతే కాకుండా హైకోర్టుని ఆశ్రయించారు హైకోర్టు కూడా రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కౌన్సిలర్లు మాత్రం భయం నెలకొని ఉంది తాజాగా జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే అధికార పార్టీ అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థమవుతుంది.
Anupama Parameswaran : స్టేజ్ పైనే డైరెక్టర్ కు షాక్ ఇచ్చిన అనుపమ.. వామ్మో ఇలా చేసిందేంటి?
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!