Terrible Incident: తాగొచ్చి గొడవ చేసిన తండ్రి.. కిరాతకంగా హతమార్చిన కొడుకు..
- శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో తండ్రిని హత్యచేసిన కొడుకు..
- తండ్రి రాములు మద్యం సేవించి నిత్యం గొడవకు దిగేవాడని హత్య..
- తన సోదరి ఇంటి వద్ద గొడవ పెట్టుకోవడంతో తండ్రిని హత్య చేసిన కొడుకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrible Incident: మద్యం సేవించి నిత్యం ఇంట్లో గొడవ చేస్తూ కుటుంబాన్ని విసిగిస్తున్నాడని కన్న తండ్రిని కొడుకు హత్యచేశాడు. ఈ దారుణమైన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఉట్ పల్లి ఇంద్రారెడ్డి నగర్ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రారెడ్డి నగర్ కాలనీలో కావలి రాములు కుటుంబం నివాసం ఉంటుంది. అయితే రాములు కుటుంబాన్ని పట్టించుకోకుండా మద్యానికి బానిసయ్యాడు. అంతే కాకుండా.. నిత్యం మద్యం సేవించి కుటుంబ సభ్యులతో రోజూ గొడవపడి విసికించేవాడు. రాములుకి ఇదే పరిపాటిగా మారింది. దీంతో కుటుంబ సభ్యులు రాములుతో విసుగు చెందేవారు. గత రాత్రి రాములు మద్యం సేవించి పక్కనే ఉంటున్న తన చెల్లెలితో గొడవకు దిగాడు.
Read also: Ponguleti Srinivas Reddy: రైతన్నకు భూమీ విషయంలో భయం లేకుండా చేస్తాం..
Also Read
అసభ్య పదజాలంతో మాటలు మాట్లాడుతూ తిట్లదండకం మొదలు పెట్టాడు. ఇంట్లోలో కాకుండా కుటుంబ పరువును వీధిపాలు చేశాడు. దీంతో రాములు కుమారుడు శివకుమార్, తండ్రిని సముదాయించే ప్రయత్నం చేసిన తనపై కూడా చేయి చేసుకున్నాడు. ఇద్దరి మద్య మాటమాట పెరిగింది. ఆ గొడవ కాస్త ఇంకా పెద్దదైంది. దీంతో తండ్రిపై విసుగు చెందిన కొడుకు శివకుమార్ కోపోద్రోక్తుడై తండ్ర తలపై ఆయుధంతో బలంగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతి చెంది మంచంపై పడివున్న రాములు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
KTR Sensational Tweet: బతుకమ్మ, మూసీపై ట్వీటర్ వేదికగా ధ్వజమెత్తిన కేటీఆర్..
తాజావార్తలు
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్తో రానున్న బ్లింక్ మోడల్
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
-
Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
-
Tilak Varma: అతడు క్రీజులో ఉన్నంత సేపు సుస్సు పడింది.. ఓటమి తప్పదనుకున్నా: తిలక్ వర్మ
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి