Site icon NTV Telugu

పెరుగుతున్న చలి తీవ్రత.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు..

తెలంగాణలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత నెలతో పొల్చితే డిసెంబర్‌ నెలల చలి తీవ్రత అధికంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ చలి తీవ్రత కొన్ని జిల్లాల్లో అధికంగా ఉండడంలో ఆయా జిల్లాల ప్రజలు ఉదయం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. తాజాగా వాతావరణ శాఖ వెల్లడించిన ఉష్ణోగ్రత ప్రకారం.. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదాల మండలంలోని నల్లవల్లి గ్రామంలో 13గా కనిష్ఠ ఉష్టోగ్రతలు నమోదయ్యాయి.

అలాగే నిజామాబాద్‌, సిద్ధిపేట, రంగారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల గనిష్ఠ ఉష్ణోగ్రతలు 14.6గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా చలి అధికంగా పెరుగుతోందని అధికారులు తెలిపారు. డిసెంబర్‌ నెల ప్రారంభంలోనే ఇలా ఉంటే రానురాను మరింత ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Exit mobile version