Site icon NTV Telugu

కాళేశ్వరం ప్రాజెక్టుకు అరుదైన గుర్తింపు

తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు మరో అరుదైన ఘనత దక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్‌కు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పోరేషన్‌ నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమీకరించుకుని లక్ష్యం మేరకు పనులు పూర్తి చేసింది.

Read Also: పీఆర్సీ జీవోలను రద్దు చేసి వెంటనే చర్చలకు పిలవాలి: విద్యాసాగర్‌రావు

రైతులకు గోదావరి జలాలను అందుబాటులోకి తీసుకురావడటంలో సఫలీకృతమైంది. కాళేశ్వరం సమీపంలో మేడిగడ్డ వద్ద శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల మధ్య అన్నారం, సుందీళ్ల గ్రామాల వద్ద కాలువలు, సోరంగ మార్గాలు, జలశాయాలు, నీటి పంపిణీ వ్యవస్థలు, ఎత్తి పోతల పథకాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 13 జిల్లాలకు సాగు నీరు, తాగు నీరందించేందుకు సీఎం కేసీఆర్‌.. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన సంగతి తెల్సిందే. అంతే కాకుండా ఏడాదిలోనే ఈ ప్రాజెక్టు కావాల్సిన అన్ని రకాల అనుమతులను తీసుకొచ్చారు. ఇది దేశంలోనే రికార్డు. ఈ ప్రాజెక్టును 2016 లో కేసీఆర్ సర్కార్‌ ప్రారంభించింది.

Exit mobile version