Praja Bhavan: ప్రజా భవన్ వద్ద రాష్ డ్రైవింగ్ కేసు.. నిందితుల్లో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు..!
Praja Bhavan: ప్రజా భవన్ వద్ద జరిగిన రాష్ డ్రైవింగ్ కేస్ లో నిందుతులని గుర్తించామని వెస్ట్ జోన్ డిసిపి విజయ్ కుమార్ అన్నారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహెల్ గా గుర్తించామన్నారు. ప్రస్తుతం రాహెల్ పరారీ లో ఉన్నాడని, మిగతా వారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. రాహెల్ ఇంట్లో పనిచేసే డ్రైవర్ తానే డ్రైవ్ చేసినట్లుగా పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి లొంగిపోయాడని అన్నారు. ర్యాష్ డ్రైవింగ్ కేసులో దర్యాప్తును వేగవంతం చేశామన్నారు. ఈ కేసులో ఎవరున్నా ఉపేక్షించేది లేదని అన్నారు. న్యూ ఇయర్ కోసం ఏర్పాటు చేసినటువంటి బ్యారికేట్స్ ను అతివేగంగా వచ్చి బిఎమ్ డబ్ల్యూ కార్ ఢీ కొట్టిందని తెలిపారు. కారులో ఇద్దరు యువకులతో పాటు ఇద్దరు యువతులు ఉన్నారని అన్నారు. ఈ విధంగా పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ప్రాథమిక విచారణలో భాగంగా అదుపులోకి తీసుకున్న వారు డ్రంకన్ కండిషన్ లో లేరన్నారు. గతంలో జూబ్లీహిల్స్ లో కూడా ప్రమాదం చేసినట్లుగా గుర్తించామన్నారు. ఆ కేసులో కూడా దర్యాప్తు చేసి పూర్వపరాలను గమనిస్తామన్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామన్నారు.
Read also: Bihar : స్కూల్ను బార్గా మార్చారు.. ఆఫీసర్లొచ్చే సరికి.. మందు, ముక్కతో రెడీగా హెచ్ఎం, టీచర్లు
Also Read
- Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
- Cyber Crime: బెట్టింగ్ రాయుళ్లపై సైబర్ క్రైమ్ పంజా.. 181 సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్లోజ్!
- Kavitha: ప్రస్తుత పాలకులకు అమ్మతనం లేదు.. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు
- Nizamabad: పోలీస్ స్టేషన్ భవనం పై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే?
బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం సృష్టించిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శనివారం (డిసెంబర్ 23) తెల్లవారుజామున 3 గంటల సమయంలో మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు (టీఎస్ 13 ఈటీ 0777) ప్రజాభవన్ ఎదుట ఉన్న ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో బారికేడ్లు పూర్తిగా ధ్వంసం కాగా.. కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ రోజు డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ యువతీయువకులకు ఆల్కహాల్ టెస్ట్ నిర్వహించేందుకు హోంగార్డును ఇచ్చి పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు పంపారు. నిర్లక్ష్యంగా కారు నడిపిన అబ్దుల్ ఆసిఫ్ (27)పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
Kalyan Ram: రెండు పడవల మీద కాళ్ళు వద్దనుకున్నా.. అందుకే వదిలేశా!
తాజావార్తలు
-
Bengal Election Results: దీదీ కోటలో కమలం వికసిస్తుందా? ఎగ్జిట్ పోల్స్లో హోరాహోరీ పోరు!
-
Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
-
Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్లో హింస..
-
Kiara: యష్’తో అప్పుడు ఇష్టమై చేశా కానీ… ఆ సీన్లు ఇప్పుడు కట్ చేయండి ప్లీజ్!
-
Tamil Producers: టోకెన్ స్ట్రైక్’కి దిగిన తమిళ నిర్మాతలు!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!