Sangareddy Crime: సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్రిక్తత.. DSP రవీంద్రా రెడ్డి తో వాగ్వాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sangareddy Crime: సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శ్రీనివాస్ మృతికి పోలీసులే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆందోలన చేపట్టారు. అక్కడకు వచ్చిన సంగారెడ్డి DSP రవీంద్రా రెడ్డితో చిన్నా అలియాస్ శ్రీనివాస్ కుటుంబ సభ్యుల వాగ్వాదానికి దిగారు. పోలీసులు, వైద్యులే చిన్నా మృతికి కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శవం కుల్లిపోయేంత వరకు ఆసుపత్రి సిబ్బంది ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు. NTV తో చిన్న భార్య సంగీత మాట్లాడుతూ.. నా భర్తని పోలీసులే చంపేశారని ఆరోపించారు. కచ్చితంగా పోలీసుల నిర్లక్ష్యంతోనే నా భర్త చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాక్సిడెంట్ కాలేదు అని నాకు అనుమానంగా ఉందని అన్నారు ఆమె.
Read also: Mirchi Price: పసిడిని దాటిన మిర్చి రేట్.. ఎనుమాముల మార్కెట్లో మిర్చికి రికార్డు ధర
Also Read
- Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
- Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
- NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
సుల్తాన్ పూర్ లో మాకు బంధువులు ఎవరు లేరని, అటు వైపు ఎందుకు వెళ్ళాడు.. ఎవరో తీసుకుపోయి చంపేశారని కన్నీటి పర్వంతం అయ్యింది. యాక్సిడెంట్ అయినప్పుడు మాకు సమాచారం ఎందుకు ఇవ్వలేదు? అంటూ ప్రశ్నించింది. చనిపోయినప్పుడు కూడా ఎందుకు చెప్పలేదని తలిపింది. నాకు న్యాయం చేయండి అంటూ వేడుకుంది. ఆందోళనకరులపై పోలీసుల లాటి ఛార్జ్ చేశారని వాపోయారు. మహిళలను కడుపులో తన్నారని ఆరోపిస్తున్నారు. తాను కడుపుతో ఉన్నానని కొట్టవద్దని ప్రాధేయ పడ్డ మహిళను కూడా వదలకుండా తన్నారని ఆరోపించారు. పోలీసులకు వ్యతిరేకంగా నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. న్యాయం చేయాలని కోరారు. దీంతో సంగారెడ్డి రహదారి స్థంబించింది. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు భారీగా చేరుకున్నారు.
ఏం జరిగింది?
గత నెల 18న సుల్తాన్ పూర్ లో రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ (28) అనే యువకుడు గాయపడ్డాడు. అయితే.. ఇది గమనించి సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు స్థానికులు. అయితే.. హాస్పిటల్కి తరలించి పుల్కల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు, 108 సిబ్బంది. గత నెల 18 నుంచి 22 వరకు సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో ఆస్పత్రిలో చికిత్స అందించారు వైద్యులు.. అయితే.. చికిత్స పొందుతూ డిసెంబర్ 23న శ్రీనివాస్ మృతి చెందాడు. శ్రీనివాస్ చనిపోయిన వెంటనే సంగారెడ్డి టౌన్, పుల్కల్ పోలీసులకు సమాచారం ఇచ్చామంటున్నారు ఆసుపత్రి వైద్యులు. అప్పటి నుంచి ఈ రోజు వరకు మార్చురీలోనే శ్రీనివాస్ డెడ్ బాడీ ఉంది. ప్రతి రోజు సమాచారం ఇచ్చినా పోలీసులు రెస్పాన్డ్ కాలేదని వైద్యులు చెబుతున్నారు. ఈ రోజు డెడ్ బాడీ దుర్వాసన రావడంతో మరోసారి పుల్కల్ పోలీసులకు ఫోన్ చేశారు ఆస్పత్రి సిబ్బంది.
అయితే.. దీంతో పోలీసులు ఆసుపత్రికి చేరుకొని.. శవాన్ని మార్చురీ నుంచి బయటికి తీస్తుండగా శ్రీనివాస్ జేబులో నుంచి ఆధార్ కార్డ్ బయటపడింది. ఆధార్ కార్డ్ ఆధారంగా శ్రీనివాస్ ది ఝారసంఘం మండలం కిష్టపూర్ గ్రామంగా గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. ఆస్పత్రికి హుటాహుటిన వచ్చిన బంధువులు.. పుల్కల్ పోలీసులు తమకు కనీస సమాచారం ఇవ్వలేదని ఆస్పత్రి ముందు బంధువుల ఆందోళన చేపట్టారు. డెడ్ బాడీ తీసుకెళ్లడానికి నిరాకరించిన బంధువులు.. తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. డెడ్ బాడీ తీసుకెళ్లకుండా ఇంటికి వెళ్లిపోయారు శ్రీనివాస్ బంధువులు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!