Sangareddy Crime: సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్రిక్తత.. DSP రవీంద్రా రెడ్డి తో వాగ్వాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sangareddy Crime: సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శ్రీనివాస్ మృతికి పోలీసులే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆందోలన చేపట్టారు. అక్కడకు వచ్చిన సంగారెడ్డి DSP రవీంద్రా రెడ్డితో చిన్నా అలియాస్ శ్రీనివాస్ కుటుంబ సభ్యుల వాగ్వాదానికి దిగారు. పోలీసులు, వైద్యులే చిన్నా మృతికి కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శవం కుల్లిపోయేంత వరకు ఆసుపత్రి సిబ్బంది ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు. NTV తో చిన్న భార్య సంగీత మాట్లాడుతూ.. నా భర్తని పోలీసులే చంపేశారని ఆరోపించారు. కచ్చితంగా పోలీసుల నిర్లక్ష్యంతోనే నా భర్త చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాక్సిడెంట్ కాలేదు అని నాకు అనుమానంగా ఉందని అన్నారు ఆమె.
Read also: Mirchi Price: పసిడిని దాటిన మిర్చి రేట్.. ఎనుమాముల మార్కెట్లో మిర్చికి రికార్డు ధర
Also Read
- Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!
- Jagadish Reddy : పవన్ వ్యాఖ్యలు ఐటెం సాంగ్స్లాంటివే.. జగదీష్ రెడ్డి సెటైర్లు.!
- OTR : జూబ్లీ హిల్స్ BRSలో మూడు ముక్కలాట! కేటీఆర్కే తలనొప్పిగా మారిన హాట్ సీట్?
- Sircilla Paddy Scam : ప్రభుత్వ ధాన్యానికి టోకరా.. నకిలీ రికార్డులతో రూ.91 లక్షలు లూటీ..!
సుల్తాన్ పూర్ లో మాకు బంధువులు ఎవరు లేరని, అటు వైపు ఎందుకు వెళ్ళాడు.. ఎవరో తీసుకుపోయి చంపేశారని కన్నీటి పర్వంతం అయ్యింది. యాక్సిడెంట్ అయినప్పుడు మాకు సమాచారం ఎందుకు ఇవ్వలేదు? అంటూ ప్రశ్నించింది. చనిపోయినప్పుడు కూడా ఎందుకు చెప్పలేదని తలిపింది. నాకు న్యాయం చేయండి అంటూ వేడుకుంది. ఆందోళనకరులపై పోలీసుల లాటి ఛార్జ్ చేశారని వాపోయారు. మహిళలను కడుపులో తన్నారని ఆరోపిస్తున్నారు. తాను కడుపుతో ఉన్నానని కొట్టవద్దని ప్రాధేయ పడ్డ మహిళను కూడా వదలకుండా తన్నారని ఆరోపించారు. పోలీసులకు వ్యతిరేకంగా నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. న్యాయం చేయాలని కోరారు. దీంతో సంగారెడ్డి రహదారి స్థంబించింది. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు భారీగా చేరుకున్నారు.
ఏం జరిగింది?
గత నెల 18న సుల్తాన్ పూర్ లో రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ (28) అనే యువకుడు గాయపడ్డాడు. అయితే.. ఇది గమనించి సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు స్థానికులు. అయితే.. హాస్పిటల్కి తరలించి పుల్కల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు, 108 సిబ్బంది. గత నెల 18 నుంచి 22 వరకు సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో ఆస్పత్రిలో చికిత్స అందించారు వైద్యులు.. అయితే.. చికిత్స పొందుతూ డిసెంబర్ 23న శ్రీనివాస్ మృతి చెందాడు. శ్రీనివాస్ చనిపోయిన వెంటనే సంగారెడ్డి టౌన్, పుల్కల్ పోలీసులకు సమాచారం ఇచ్చామంటున్నారు ఆసుపత్రి వైద్యులు. అప్పటి నుంచి ఈ రోజు వరకు మార్చురీలోనే శ్రీనివాస్ డెడ్ బాడీ ఉంది. ప్రతి రోజు సమాచారం ఇచ్చినా పోలీసులు రెస్పాన్డ్ కాలేదని వైద్యులు చెబుతున్నారు. ఈ రోజు డెడ్ బాడీ దుర్వాసన రావడంతో మరోసారి పుల్కల్ పోలీసులకు ఫోన్ చేశారు ఆస్పత్రి సిబ్బంది.
అయితే.. దీంతో పోలీసులు ఆసుపత్రికి చేరుకొని.. శవాన్ని మార్చురీ నుంచి బయటికి తీస్తుండగా శ్రీనివాస్ జేబులో నుంచి ఆధార్ కార్డ్ బయటపడింది. ఆధార్ కార్డ్ ఆధారంగా శ్రీనివాస్ ది ఝారసంఘం మండలం కిష్టపూర్ గ్రామంగా గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. ఆస్పత్రికి హుటాహుటిన వచ్చిన బంధువులు.. పుల్కల్ పోలీసులు తమకు కనీస సమాచారం ఇవ్వలేదని ఆస్పత్రి ముందు బంధువుల ఆందోళన చేపట్టారు. డెడ్ బాడీ తీసుకెళ్లడానికి నిరాకరించిన బంధువులు.. తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. డెడ్ బాడీ తీసుకెళ్లకుండా ఇంటికి వెళ్లిపోయారు శ్రీనివాస్ బంధువులు.
తాజావార్తలు
-
Story Board: పుత్తడి అమ్మకాలు ఎందుకు తగ్గాయి..? ఆర్థిక పరిస్థితులే కారణమా..?
-
Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!
-
Off The Record: శృంగవరపు కోట TDPలో గ్రూప్ వార్!
-
UP: అమిత్ షాతో ఎస్పీ ఎంపీ భేటీ!.. అఖిలేష్ యాదవ్కు భారీ ఝలక్ తప్పదా?
-
kitchen tips: చపాతీ కర్రకు బూజు పడుతోందా? ఈ చిన్న ట్రిక్తో ఫంగస్కు చెక్ పెట్టండి!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!