జలమండలి ఉద్యోగులకు తెలంగాణ రాష్ర్ట సర్కార్ తీపి కబురు చెప్పింది. జలమండలి బోర్డులో పని చేస్తున్న ఉద్యోగులందరికి పీఆర్సీ అమలు చేసేందుకు వీలుగా తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఆమోద ముద్రను వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేసీఆర్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఈ నెల నుంచే పీఆర్సీ అమలు కానుందని అధికారికంగా తెలిపింది.
నవంబర్ మాసం నుంచే వేతనాలను చెల్లించడానికి కేసీఆర్ సర్కార్ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది. గత కొన్ని నెలలుగా జలమండలి ఉద్యోగులు పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెల్సిందే.. అయితే తాజాగా జలమండలి ఉద్యోగుల డిమాండ్లను పరిగణలోకి తీసుకున్న కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ పీఆర్సీ అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై జల మండలి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
