TGSRTC : రాష్ట్రంలో ఆర్టీసీకి కొత్త ఊపు.. రూ.108.02 కోట్లతో బస్ స్టేషన్ల ఆధునీకరణ
- రాష్ట్ర వ్యాప్తంగా RTC బస్ స్టేషన్ల అభివృద్ధికి 108 కోట్ల మంజూరు
- 30 బస్ స్టేషన్లు, కొత్త డిపోల నిర్మాణానికి పరిపాలన అనుమతులు
- ప్రయాణికుల సౌకర్యం, ఉద్యోగుల సంక్షేమంపై RTC దృష్టి
- మహాలక్ష్మి పథకం తర్వాత RTCలో కొత్త ఊపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGSRTC : తెలంగాణ రాష్ట్రంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త బస్ డిపోలు నిర్మాణం, పాత బస్ స్టేషన్ల పునరుద్ధరణ, ఆధునీకరణ పనుల కోసం ప్రభుత్వం రూ.108.02 కోట్ల నిధులు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఈ వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ మంజూరులో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్న 30 బస్ స్టేషన్లు, డిపోలు అభివృద్ధి కాబోతున్నాయి. వాటిలో ముఖ్యంగా మద్గుల్, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, నిజామాబాద్, వేములవాడ, పాల్వంచ, అశ్వరావుపేట, హుస్నాబాద్, గోదావరిఖని, నర్సంపేట వంటి బస్ స్టేషన్లు ఉన్నాయి. కొన్ని చోట్ల కొత్త డిపోలు నిర్మించబడుతుండగా, మరికొన్ని చోట్ల పునరుద్ధరణ, షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణం చేపట్టబడనుంది.
ఈ ప్రాజెక్టుల అమలుకు కావాల్సిన అన్ని చర్యలు తక్షణమే ప్రారంభించాలని ఆర్టీసీ సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి ఆదేశాలు జారీ చేయబడ్డాయి. త్వరితగతిన పనులు పూర్తిచేసి, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఉందని అధికారులు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “గత 10 సంవత్సరాలుగా ఆర్టీసీ నిర్వీర్యంగా మారింది. కానీ మహాలక్ష్మి పథకం ద్వారా కొత్త బస్సులు కొనుగోలు చేయడం, కొత్త డిపోలు ఏర్పాటు చేయడం, బస్ స్టేషన్లను ఆధునీకరించడం ప్రారంభించాం. సంస్థ పరిరక్షణ, ప్రయాణికుల భద్రత, ఉద్యోగుల సంక్షేమం – ఈ మూడు అంశాలను దృష్టిలో ఉంచుకొని RTCను మరింత ముందుకు తీసుకెళ్తాం,” అని స్పష్టం చేశారు.
Also Read
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..