Telangana Ration Cards : తెలంగాణలో రేషన్ కార్డుల కలకలం.. ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే కార్డు రద్దవుతుందా.?
- IT రిటర్న్స్తో రేషన్ కార్డులపై భయం
- గ్రామాల్లో అధికారుల క్షేత్రస్థాయి తనిఖీలు
- టాక్స్ పేయర్ vs IT ఫైలర్ గందరగోళం
- ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డు లబ్ధిదారుల్లో ప్రస్తుతం ఒక కొత్త భయం పట్టుకుంది. ఆదాయపన్ను రిటర్న్స్ (IT Returns) దాఖలు చేసిన వారి రేషన్ కార్డులు రద్దు కానున్నాయనే ప్రచారం గ్రామాల్లో తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. ప్రభుత్వ పథకాలకు ప్రామాణికంగా ఉన్న రేషన్ కార్డు ఎక్కడ చేజారిపోతుందోనని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.
గ్రామ పరిపాలన అధికారులు (GPOలు) నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వచ్చి విచారణ చేస్తుండటంతో ఈ ప్రచారం మరింత వేగవంతమైంది. ముఖ్యంగా వార్షికాదాయం రూ. 6 లక్షల కంటే ఎక్కువ చూపించి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన వారి వివరాలను ఆదాయపన్ను శాఖ నుంచి సేకరించిన అధికారులు, వారి అర్హతపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సుమారు 30,186 మంది, సిద్దిపేట జిల్లాలో 14,200 మందిపై ఈ విచారణ జరుగుతున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఖ్య లక్షల్లో ఉండే అవకాశం ఉంది.
Also Read
Oracle Layoffs Hit India: ఒరాకిల్లో భారీ లేఆఫ్స్.. భారత్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు బిగ్ షాక్..
రేషన్ కార్డు కేవలం బియ్యం కోసమే కాకుండా, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ వంటి కీలక సంక్షేమ పథకాలకు ప్రామాణికంగా మారింది. ఒకవేళ కార్డు రద్దయితే ఈ పథకాలన్నీ నిలిచిపోతాయనే భయం ప్రజల్లో నెలకొంది. అయితే, ఆదాయపన్ను చెల్లించే వారికి (Tax Payers), కేవలం రిటర్న్స్ దాఖలు చేసే వారికి (IT Filers) మధ్య చాలా తేడా ఉంటుంది. చాలామంది చిన్న వ్యాపారులు బ్యాంక్ రుణాలు పొందడం కోసమో లేదా డిజిటల్ లావాదేవీల ద్వారా కట్ అయిన TDS రీఫండ్ క్లెయిమ్ చేయడం కోసమో తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ రిటర్న్స్ దాఖలు చేస్తుంటారు. ఇప్పుడు విచారణ పేరుతో తమ కార్డులు ఎక్కడ తొలగిస్తారోనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Off The Record: వివాదాస్పదంగా బెందాళం అశోక్ తీరు.. గిరిజనులనుద్దేశించి నోటి దురద మాటలు..
రేషన్ కార్డుల రద్దుపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కేవలం అనర్హులను గుర్తించే ప్రక్రియలో భాగంగానే ఈ విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో సేకరించిన నివేదికల ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అర్హులైన పేదలకు అన్యాయం జరగకుండా, కేవలం అక్రమంగా కార్డులు పొందిన వారిని మాత్రమే తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ఆదాయపన్ను రిటర్న్స్ ఫైల్ చేసిన ప్రతి ఒక్కరినీ అనర్హులుగా ముద్ర వేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్తో మరింత ఆదా.!
-
CM Chandrababu: నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తలతో సమావేశం!
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
-
స్టార్ హీరో లేడు.. భారీ ప్రమోషన్ లేదు.. రూ.2 కోట్ల బడ్జెట్తో రూ.130 కోట్లు వసూళ్లు.. Hanuman Ansh ఫుల్ స్టోరీ ఇదే!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపార లాభాలు, సామాజిక గౌరవం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!