Local Body Elections : ముగిసిన మూడో దశ పంచాయతీ పోలింగ్..

  • ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్
  • 80.78 శాతం ఓటింగ్ నమోదు
  • మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
  • సాయంత్రానికి పూర్తి ఫలితాలు
Telangana Panchayat Elections 2025

Telangana Panchayat Elections 2025

Local Body Elections : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్, మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. గడువు ముగిసే సమయానికి క్యూలైన్‌లో ఉన్న ఓటర్లందరికీ అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు.

ఈ మూడో దశలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,752 సర్పంచ్ స్థానాలకు, 28,410 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అయితే.. మధ్యాహ్నం 1 గంటల వరకు 80.78% పోలింగ్ నమోదయ్యింది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. పోలింగ్ ముగిసిన అనంతరం, మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించనున్నారు. తొలుత వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. వార్డుల లెక్కింపు పూర్తి కాగానే సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తారు.

×
×
Ad

సర్పంచ్ ఎన్నిక ఫలితాలను అధికారికంగా ప్రకటించిన వెంటనే, తదుపరి ప్రక్రియగా ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహిస్తారు. ఉప సర్పంచ్ ఎన్నిక: సర్పంచ్ ఫలితం తేలిన తర్వాత, నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, వారి సమక్షంలో ఉప సర్పంచ్ ఎన్నికను పూర్తి చేస్తారు. సాయంత్రానికల్లా మెజారిటీ గ్రామాల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి.

Cancer Research Study: క్యాన్సర్ రోగులకు గుడ్‌న్యూస్..వ్యాధిని తగ్గించే చికిత్సను కనుగొన్న శాస్త్రవేత్తలు!