Wines Tender : తెలంగాణలో మద్యం టెండర్లకు నేటితో ముగియనున్న గడువు
- తెలంగాణలో మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ చివరి రోజు
- బీసీ బంద్, బ్యాంకుల బంద్తో గడువు అక్టోబర్ 23 వరకు పొడిగింపు
- ఇప్పటివరకు 90 వేలకుపైగా దరఖాస్తులు
- అక్టోబర్ 27న లాటరీ ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wines Tender : తెలంగాణలో కొత్త మద్యం షాపుల లైసెన్సుల కోసం దరఖాస్తుల స్వీకరణ చివరి దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల స్వీకరణ నేడు ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్లైన్ లేదా నిర్దేశిత కౌంటర్ల ద్వారా దరఖాస్తులు సమర్పించుకునే అవకాశం ఉంది. గత వారం బీసీ బంద్ , కొన్ని బ్యాంకుల మూసివేత కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోయామంటూ వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న ఎక్సైజ్ శాఖ, అసలు గడువును రెండు రోజుల పాటు పొడిగిస్తూ అక్టోబర్ 23 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగించనున్నట్లు ప్రకటించింది.
ఎక్సైజ్ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం, అక్టోబర్ 18 నాటికి మొత్తం 89,344 దరఖాస్తులు స్వీకరించగా, బుధవారం నాటికి ఆ సంఖ్య 90,316కు చేరుకుంది. చివరి రోజున భారీగా అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించే అవకాశం ఉన్నందున, జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లు, సాంకేతిక సిబ్బంది, హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
ఈ సారి మద్యం షాపుల కేటాయింపును పారదర్శకంగా నిర్వహించడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది. దరఖాస్తుల పరిశీలన పూర్తయిన అనంతరం అక్టోబర్ 27న లాటరీ ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు జరగనుంది. ఈ లాటరీ కార్యక్రమాన్ని సంబంధిత జిల్లా కేంద్రాల్లో ప్రజల సమక్షంలో, వీడియో రికార్డింగ్ సహితంగా నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. ఇదే సమయంలో, మద్యం షాపుల టెండర్ల ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. గత లైసెన్సు కాలంలో కంటే ఈసారి దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉండటం, వ్యాపార వాతావరణం మెరుగుపడటానికి సంకేతమని వారు అభిప్రాయపడ్డారు.
CM Chandrababu: దుబాయ్లో చంద్రబాబు రోడ్ షో.. రాష్ట్రాన్ని ఆవిష్కరించిన సీఎం..
తాజావార్తలు
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!