NTV Telugu Site icon

Telangana: తెలంగాణలో వరల్డ్ వాటర్ ఫాల్ రాప్లింగ్ పోటీలు

World Waterfall Rapling Min

World Waterfall Rapling Min

వరల్డ్ వాటర్‌ఫాల్‌ రాప్లింగ్ మూడో విడత పోటీలకు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చో్డ మండలంలోని గుండివాగు వద్ద 330 అడుగుల ఎత్తున్న గాయత్రి జలపాతంలో ఈ పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీలలో 30కిపైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 33 టీవీ ఛానెల్స్‌ ఈ పోటీలను టెలికాస్ట్‌ చేస్తాయని చెప్పారు. ఉవ్వెత్తున దూకే జలపాత ధారల్లో తాడు సాయంతో పై నుంచి (స్ట్రెయిట్‌ పాయింట్‌) కిందకు (ఫినిష్‌ పాయింట్‌)కు చేరడాన్నే వాటర్‌ఫాల్‌ రాప్లింప్‌ అంటారు. ప్రపంచంలోని చాలా దేశాలు అడ్వెంచర్‌ టూరిజంలో భాగంగా సాహసాలు చేసేవారి కోసం ఈ పోటీలను నిర్వహిస్తున్నాయి.

Read Also: Godavari River Floods: 32 ఏళ్ల తర్వాత 70 అడుగులు.. నీట మునిగిన 95 గ్రామాలు

కాగా కరోనా కారణంగా ఏడాది విరామం తర్వాత ఈ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. గతంలో రెండు ప్రపంచ వాటర్ ఫాల్ రాప్లింగ్ పోటీలు 2019, 2020లో ఏపీ అరకులోయలోని 420 అడుగుల కటిక జలపాతం వద్ద జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టూరిజం శాఖ ప్రోత్సాహం, ఐటీడీఏ వారి పూర్తి సహకారంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని వాటర్‌ ఫాల్‌ రాప్లింప్‌ వరల్డ్‌ కప్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ వ్యవస్థాపకుడు రంగారావు పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో తెలంగాణ అడ్వెంచర్‌ టూరిజంలో దేశంలోనే మొదటిస్థానంలో నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.