Site icon NTV Telugu

కరోనా పరిస్థితులపై నేడు తెలంగాణ హై కోర్టు లో విచారణ ..

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కరోనా పరిస్థితుల పై నేడు హైకోర్టు విచారణ జరపనుంది. గతంలో కోర్ట్ ఇచ్చిన ఆదేశాల అమలు, రాష్ట్రంలో ఉన్న కేసులు వివరాలపై ఆరా తీయనుంది హైకోర్టు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత, రేమిడిసివర్ ఇంజెక్షన్ల బ్లాక్ మార్కెట్ పై నివేధించనున్నాయి వైద్య శాఖ, పోలీస్ శాఖ. ఈనెల 14 న రంజాన్ పండుగ సందర్భంగా ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు రీలాక్సేషన్ సమయంలో వీడియో గ్రఫీ సమర్పించనున్నారు పోలీసులు. మూడు కమిషనరేట్స్ పరిధిలోని వీడియో గ్రఫీని కోర్ట్ కు సమర్పించనున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రలో రోజుకు నాలుగు వేలకు పైగా కరోనా కేసులు వస్తున్న విషయం తెలిసిందే.

Exit mobile version