NTV Telugu Site icon

TS 6 Guarantees: ప్రజాపాలనకు పోటెత్తిన దరఖాస్తులు.. రెండోరోజుల్లో 8.12 లక్షలు

Praja Palana Darakhastulu

Praja Palana Darakhastulu

TS 6 Guarantees: అభయ హస్తం కింద ప్రభుత్వం అందించనున్న 6 హామీ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కేంద్రాల బాట పడుతున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన తొలిరోజు గురువారం 7.46 లక్షల దరఖాస్తులు రాగా, రెండో రోజైన శుక్రవారం 8.12 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. చాలా చోట్ల దరఖాస్తు ఫారాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు ప్రజల నుంచి డబ్బులు దండుకున్నారు. అయితే జిరాక్స్ దరఖాస్తులను అధికారులు తిరస్కరించడంతో అసలు సమస్య మొదలైంది. ఈ క్రమంలో గ్రామ, వార్డు, డివిజన్ సమావేశాలకు జనం పోటెత్తుతున్నారు. తమకు కావాల్సిన పథకాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఎక్కువ మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇవే కాకుండా గృహజ్యోతి, మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాలకు పెద్దపీట వేస్తున్నారు.

Read also: Nitish Kumar : ఎన్టీయే నుంచి వైదొలగనున్న నితీశ్ కుమార్.. ప్రధాని అభ్యర్థి ఆయనే ?

అయితే కొన్ని కేంద్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. గంటల తరబడి వేచి చూసినా దరఖాస్తు ఫారాలు సరిపోకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనానికి గురయ్యారు. కేంద్రాల్లో కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదు. దరఖాస్తు పత్రాలు లేకపోవడంతో జిరాక్స్ సెంటర్లను దోచుకున్నారు. ఒక్కో దరఖాస్తు ఫారానికి రూ.50 నుంచి రూ.100 వసూలు చేశారు. అయితే ఆ జిరాక్స్ దరఖాస్తులను అధికారులు తిరస్కరించడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. రెండో రోజు మొత్తం 8,12,862 దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. జీహెచ్‌ఎంసీతోపాటు నగర, పట్టణ ప్రాంతాల్లో 4,89,000 దరఖాస్తులు వచ్చాయని, గ్రామీణ ప్రాంతాల నుంచి 3,23,862 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజా పరిపాలనలో భాగంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమావేశాలు నిర్వహిస్తారు. అయితే చలిని సైతం లెక్కచేయకుండా ఉదయం 6, 7 గంటల నుంచే అసెంబ్లీకి చేరుకుని క్యూలో నిల్చున్నారు. అయితే ఈ 6 హామీల కోసం దరఖాస్తు చేస్తున్న వారికి అనేక సందేహాలు తలెత్తుతున్నాయి.

Read also: INDIA : ఇండియా కూటమిలో కొలిక్కి రాని సీట్ల లొల్లి.. బహిరంగంగా బయటకు వస్తున్న పార్టీల ‘కోరిక’

సొంత గ్రామంలో రేషన్‌కార్డు ఉన్న వారు ప్రస్తుతం కుటుంబంతో సహా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అయితే ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇక మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ గ్యాస్ కనెక్షన్లు పురుషుల పేరిట ఉండడంతో వారికి గ్యాస్ సబ్సిడీ వస్తుందా.. లేక మహిళల పేరుతో గ్యాస్ కనెక్షన్ మార్చుకోవాలా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు రెండో రోజైన శుక్రవారం సీఎస్ శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. డబ్బులు పెట్టి దరఖాస్తు ఫారాలు కొంటున్నారనే వార్తల నేపథ్యంలో.. అలాంటి పరిస్థితి రాకూడదని ఆదేశించారు. దరఖాస్తులు పూరించడంలో ప్రజలకు సహకరించేందుకు, టెంట్లు, బారికేడ్లు, తాగునీరు అందించేందుకు వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎస్ అధికారులకు సూచించారు.
Guntur: గుంటూరులో వీధి కుక్కల స్వైర విహారం.. బాలుడిపై దాడి..