హుజురాబాద్ ఉప ఎన్నిక ఏర్పాట్లపై తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ మాట్లాడారు. రేపటి ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం అని చెప్పిన ఆయన ఈవీఎంలు, వీవీ ప్యాట్ లు పోలింగ్ కేంద్రాలకు చేరాయి. బ్లైండ్ ఓటర్ల కోసం బ్రెయిలీ ఈవీఎంలు సిద్ధం చేశాం. 32 మంది మైక్రో అబెజర్వేషన్లు ఉన్నారు. 3868 మంది పోలీసు బలగాలు బందోబస్తు చేస్తున్నాం. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేసాం. కోవిడ్ నిబంధనలతో అని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లు మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి. ఫిర్యాదులపై విచారణ చేసి కేసులు నమోదు చేశాం. ఉప ఎన్నికల్లో 3 కోట్ల 50 లక్షల క్యాష్ పట్టుకున్నాం. ఎన్నికల సంఘానికి నివేదిక పంపించాను అని చెప్పిన ఆయన హుజురాబాద్ ఓటర్లు అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అని సూచించారు
హుజురాబాద్ ఉప ఎన్నిక ఏర్పాట్లపై శశాంక్ గోయల్…
