Site icon NTV Telugu

Corona Updates : తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు..

Corona

Corona

కరోనా మహమ్మారి మరోసారి తెలంగాణలో విజృంభిస్తోంది. గత మూడు రోజుల నుంచి సెంచరీ కొట్టిన కరోనా కేసులు సంఖ్య.. తాజాగా డబుల్‌ సెంచరీ కొట్టింది. గడిచిన 24 గంటల్లో 22,662 కరోనా పరీక్షలు నిర్వహించగా, 219 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 164 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే.. రంగారెడ్డి జిల్లాలో 19, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 11 కేసులు చొప్పున కరోనా కేసులు నమోదుయ్యాయి.

అలాగే ఒక్కరోజు 76 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 7,94,803 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,89,433 మంది కరోనా నుంచి కొలుకున్నారు. అటు, యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో 1,259 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతిచెందారు.

 

Exit mobile version