తెలంగాణలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కొత్త అధ్యక్షులను ప్రకటించింది ఆల్ఇండియా కాంగ్రెస్ కమిటీ. మొత్తం 36 మంది పేర్లను ఖరారు చేస్తూ 33 జిల్లాలతో పాటు కొన్ని కార్పొరేషన్లకు కూడా కొత్త బాధ్యులను నియమించింది. పలు జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఆయా డీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఖలీఫ్ సైదుల్లా, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడిగా దీపక్ జాన్ ను ఏఐసీసీ ప్రకటించింది. రంగారెడ్డి, సంగారెడ్డి మినహా అన్ని జిల్లాలకు డీసీసీలను ప్రకటించింది అధిష్టానం.
జిల్లావారీగా కొత్త డీసీసీ అధ్యక్షులు
- ఆదిలాబాద్ – నరేష్ జాదవ్
- అసిఫాబాద్ – ఆత్రం సుగుణ
- భద్రాద్రి కొత్తగూడెం – తోట దేవీ ప్రసన్న
- భువనగిరి – బీర్ల అయిలయ్య
- గద్వాల – ఎం. రాజీవ్ రెడ్డి
- హన్మకొండ – వెంకటరాం రెడ్డి
- హైదరాబాద్ – ఖలీఫ్ సైదుల్లా
- జగిత్యాల – నందయ్య
- జనగాం – లఖావత్ ధనావతి
- భూపాలపల్లి – కరుణాకర్
- కామారెడ్డి – మల్లిఖార్జున్
- కరీంనగర్ – మేడిపల్లి సత్యం
- కరీంనగర్ కార్పొరేషన్ – వి. అంజన్ కుమార్
- ఖైరతాబాద్ – రోహిత్ ముదిరాజ్
- ఖమ్మం – నూతి సత్యనారాయణ
- ఖమ్మం కార్పొరేషన్ – దీపక్ చౌదరి
- మహబూబాబాద్ – భూక్య ఉమా
- మహబూబ్నగర్ – సంజీవ్ ముదిరాజ్
- మంచిర్యాల – రఘునాథ్ రెడ్డి
- మెదక్ – శివన్నగిరి ఆంజనేయులు గౌడ్
- మేడ్చల్–మల్కాజిగిరి – తోటకూర వజ్రేష్ యాదవ్
- ములుగు – పైడాకుల అశోక్
- నాగర్ కర్నూలు – డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
- నల్గొండ – కైలాశ్ నేత
- నారాయణ్పేట్ – కొల్లుకుదురు ప్రశాంత్ రెడ్డి
- నిర్మల్ – వెడ్మ బొజ్జు
- నిజామాబాద్ – నగేశ్ రెడ్డి
- నిజామాబాద్ కార్పొరేషన్ – బొబ్బిలి రామకృష్ణ
- పెద్దపల్లి – ఎంఎస్ రాజ్ ఠాకూర్
- రాజన్న సిరిసిల్ల – సంగీతం శ్రీనివాస్
- సికింద్రాబాద్ – దీపక్ జాన్
- సిద్దిపేట్ – ఆంక్షా రెడ్డి
- సూర్యాపేట్ – గుడిపాటి నర్సయ్య
- వికారాబాద్ – ధారాసింగ్ జాదవ్
- వనపర్తి – శివసేనా రెడ్డి
- వరంగల్ – మహ్మద్ అయ్యుబ్
